ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

0

 విజయవాడ నగరపాలక సంస్థ

19-05-2025

 ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు అందే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు, వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 12, ఇంజనీరింగ్ 3 , రెవెన్యూ సంబంధించినవి 1, వైద్య & ఆరోగ్యం 1, మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రాజెక్ట్. డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, సూపరిండెంటింగ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ కృష్ణ నాయక్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజీస్ట్ సూర్య కుమార్, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version