Home Andhra Pradesh దాన సువర్చలం• మహిళ సాధికారత, అభ్యున్నతికి పొన్నెకంటి సువర్చల శశికిరణ్ ఎకరం భూమి విరాళం

దాన సువర్చలం• మహిళ సాధికారత, అభ్యున్నతికి పొన్నెకంటి సువర్చల శశికిరణ్ ఎకరం భూమి విరాళం

4
0

దాన సువర్చలం
• మహిళ సాధికారత, అభ్యున్నతికి పొన్నెకంటి సువర్చల శశికిరణ్ ఎకరం భూమి విరాళం
• కొలకలూరులో ఎం.ఎస్.ఎం.ఈ. ప్రాజెక్టు కోసం ఎకరా స్థలం ప్రభుత్వానికి అప్పగింత
• రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో అధికారులకు రిజిస్ట్రేషన్ చేసి అప్పగించిన దాత
• ప్రాజెక్ట్ పనులు వేగవంతం కోసం రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ రూ.10 లక్షల విరాళం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఈ.) ఏర్పాటు కోసం తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పొన్నెకంటి పోతురాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో పొన్నెకంటి సువర్చల శశికిరణ్ ప్రభుత్వానికి ఎకరం స్థలం విరాళంగా ఇచ్చారు. సోమవారం ఉదయం తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఈ భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారుల సమక్షంలో దస్తావేజులను తెనాలి సబ్ కలెక్టర్ కు అందించారు. ఈ సందర్భంగా దాత సువర్చల శశికిరణ్ ని మనోహర్ సత్కరించారు. ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా చేపట్టేందుకు నాదెండ్ల మనోహర్ సైతం రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు.
• మనోహర్ ఉన్నారనే విశ్వాసంతో…
ఈ సందర్భంగా సువర్చల శశికిరణ్ మాట్లాడుతూ… “గతంలో కొలకలూరు గ్రామానికి ఎన్నో ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చాయి. అయితే స్థలం లేమి కారణంగా వెనక్కి వెళ్లిపోయాయి. స్థలం సమస్య కారణంగా ఈ ప్రాంత మహిళలు ఉపాధి కోల్పోవడం భావ్యంకాదని భావించి నాకున్న అర ఎకరంతోపాటు పక్కనున్న మరో అర ఎకరం కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందించాం. శ్రీరాముడికి ఊడత సాయం చేసినట్లు.. ప్రభుత్వానికి నా వంతు సాయం అందిస్తున్నాను. ప్రతిఫలం ఆశించకుండా పది మందికి ఉపయోగపడాలని మా తండ్రి పోతురాజు చెప్పేవారు. ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాను. నాదెండ్ల మనోహర్ వద్ద ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ఆయనో విజనరీ. మా ఊరిని అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉంది. మనోహర్ ఉన్నారు, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే విశ్వాసంతో ఆయన సమక్షంలో ప్రభుత్వానికి స్థలం ఇచ్చాము.
• జనసేన యువత మద్దతుగా ఉన్నారు
మా ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో పని చేస్తున్నాము. నా వెన్నంటి జనసేన యువత ఉన్నారు. నా మీద అచంచల విశ్వాసం ఉంది. ఏదైనా చెబితే తప్పకుండా చేద్దాము అని ఉత్సాహంగా, మద్దతుగా ముందుకు వస్తారు. ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ వస్తే ఆ వెనుక మరికొన్ని వస్తాయి. ఉపాధి అవకాశాలు లభిస్తాయి”న్నారు.
• పనుల్లో జాప్యం లేకుండా చూస్తాం: నాదెండ్ల మనోహర్
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “తెనాలి నియోజకవర్గంలో మహిళలు, యువత ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటున్నాం. యూనిట్ల ఏర్పాటుతోపాటు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ కి కృషి చేస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. తెనాలిలో కూడా పలువురు దాతల సహకారంతో మన ప్రాంతానికి పేరు తెచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో తెనాలి ప్రాంతంలో మహిళల కోసం ప్రత్యేక ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు పెడదామని ఆలోచన చేశాం. అప్పట్లో ప్రభుత్వ భూమి లభ్యత లేక ప్రాజెక్టు చర్చల దశలో నిలిచిపోయింది. అదే విషయం సువర్చల శశికిరణ్ తో చర్చించినప్పుడు కొలకలూరు గ్రామంలో ఎకరం భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. చిన్న కుటుంబ నేపథ్యమే అయినప్పటికీ తన తండ్రి పోతురాజు పేరుని నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఆ కుటుంబం ఆదర్శవంతంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు కోసం మా కుటుంబం నుంచి రూ.10 లక్షలు విరాళంగా ఇస్తాం. భవన నిర్మాణం పనుల్లో ఎక్కడా జాప్యం లేకుండా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యే విధంగా మా వంతు సహకారం అందిస్తాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here