*ఎన్టీఆర్ జిల్లా, మార్చి 29, 2025*
తలసరి ఆదాయం, జీడీడీపీలో జిల్లాను ముందంజలో నిలపాలి
– *ఇతర జిల్లాలతో ఆరోగ్యకర పోటీతో సమష్టి భాగస్వామ్యంతో కృషిచేయాలి*
– *స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి*
– *అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర వార్షిక వృద్ధికి మించి పురోగతికి కృషిచేయాలి*
– *జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు*
– *వినూత్న ఆలోచనతో ఖిల్లాపై డీఆర్సీ నిర్వహించడం అభినందనీయం*
– *జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్*
చారిత్రక ఔన్నత్యానికి చిహ్నమైన కొండపల్లి ఖిల్లాపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. గతంలో ఎన్నడూలేని విధంగా కొండపల్లి ఖిల్లాపై జిల్లా అభివృద్ధికి నాంది పతాక ఎగిరింది. పర్యాటక, ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో స్వర్ణాంధ్ర@2047 దార్శనికతకు అనుగుణంగా వినూత్న ఆలోచనతో శనివారం ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి కోటలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా రెండో జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం జరిగింది. సమావేశంలో తొలుత గత నవంబర్ 30న జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన, చర్చించిన 113 అంశాలపై తీసుకున్న చర్యలను సమావేశం ముందుంచారు. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు, మిరపకు కనీస మద్దతు ధర, తుమ్మలపాలెం ఎత్తిపోతలకు విద్యుత్ సరఫరా, పోలంపల్లి ప్రాజెక్టు మరమ్మతులు, ముక్త్యాల ఎత్తిపోతల పథకం, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఏపీఐఐసీ భూముల గుర్తింపు, పెనుగంచిప్రోలు ఎత్తిపోతలకు మరమ్మతులు, నందిగామ సీహెచ్సీ అప్గ్రెడేషన్.. ఇలా వ్యవసాయ, అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాలకు చెందిన వివిధ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. వ్యవసాయ, ఉద్యాన రైతులతో పాటు విజయవాడలోని వివిధ కాలనీల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడదపైనా, వీధి కుక్కల సమస్యపైనా సమావేశంలో చర్చించారు.
సమావేశం అనంతరం ఇన్ఛార్జ్మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా, పేదల జీవన ప్రమాణాలు పెంచాలనే సంకల్పంతో జిల్లాను అన్ని రంగాల్లోనూ పురోగతి దిశగా పయనించేలా చేసేందుకు వినూత్న ఆలోచనతో కొండపల్లి ఖిల్లాపై జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయం.. ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో జిల్లాను తలసరి ఆదాయంలోనూ, స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ముందుండేలా సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా తలసరి ఆదాయం రూ. 3,53,150గా ఉందని.. 2025-26లో తలసరి ఆదాయ లక్ష్యాన్ని రూ. 4,17,412గా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. తలసరి ఆదాయంలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని.. ఈ విషయంలో ఆరోగ్యకర పోటీతత్వంతో జిల్లాను తొలిస్థానానికి తీసుకొచ్చేందుకు, అదేవిధంగా జీడీడీపీ, జడీవీఏ లక్ష్యాలను కూడా చేరుకునేందుకు ప్రతి శాఖకు చెందిన అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకురావాలన్నారు. ప్రతిశాఖలోనూ విలువ జోడింపునకు కృషిచేసినప్పుడే.. 15 శాతం సుస్థిర వార్షిక వృద్ధిని మించి పురోగతి సాధించేందుకు వీలవుతుందన్నారు. 2025-26లో వ్యవసాయ రంగ వృద్ధిలో పురోగతి లక్ష్యం 15.94 శాతం, పారిశ్రామిక వృద్ధి లక్ష్యం 18.57 శాతం, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు రంగ వృద్ధి లక్ష్యం 22.22 శాతంగా ఉన్నట్లు మంత్రివర్యులు వివరించారు.
*రాజకీయ వివక్షకు తావులేకుండా..*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను రాజకీయ వివక్షకు తావులేకుండా చివరిమైలు లబ్ధిదారునికీ చేరువచేసేందుకు అధికారులు కృషిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పీ4 విధానాన్ని ఉగాది రోజున ఆవిష్కరించనుందని.. ప్రభుత్వ సహకారంతో పాటు ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లాను తద్వారా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా నడిపించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములుకావాలని.. ఈ గొప్ప ప్రయాణంలో అధికారులు ఉదాసీనతకు తావులేకుండా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జిల్లాలో అద్భుత పర్యాటక కేంద్రాలున్నాయని.. వీటికి ప్రాచుర్యం కల్పించేందుకు, పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలతో టెంపుల్ టూరిజం సర్క్యూట్తో పాటు సమ్మిళిత టూరిజం ప్యాకేజీలకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఉదాహరణకు ఉత్తరాంధ్ర నుంచి తిరుమల వెళ్లే భక్తుల్లో చాలామంది తిరిగి వచ్చేటప్పుడు తప్పనిసరిగా విజయవాడ అమ్మవారిని దర్శించుకుంటారని, ఈ నేపథ్యంలో భక్తులకు ఆధ్మాత్మిక, పర్యాటక మధురానుభూతిని మిగిల్చేలా ప్యాకేజీలు ఉపయోగపడతాయన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల పెద్దఎత్తున ఉపాధిసృష్టితో పాటు సంపద సృష్టికి వీలవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి, యువతలో నైపుణ్యాభివృద్ధికీ చొరవచూపుతున్నట్లు తెలిపారు.
*పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
హోటళ్లు, ట్రావెల్ అసోసియేషన్లతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో పలు దఫాల్లో సమావేశాలు నిర్వహించి మూడు రోజుల టెంపుల్ టూరిజం, నాలుగు రోజుల టూరిజం ప్యాకేజీలకు రూపకల్పన చేయడం జరిగిందని.. ఇవి మరో వారం పదిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం వాటా 2024-25లో 67.19 శాతంగా ఉందని.. 2025-26లో ఈ లక్ష్యం 67.29 శాతమని.. ఈ గణాంకాలను చూస్తే జిల్లా సేవరంగం అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయన్నారు. సేవారంగంలో ఆతిథ్యం, పర్యాటకం భాగస్వామ్యం చాలా ఎక్కువని, అందుకే ఈ రంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఓ చిన్న ఆలోచన పెద్ద మార్పునకు దారితీస్తుందని.. కొండపల్లి ఖిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం సీఎస్ఆర్ నిధులతో పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే లేజర్ షో అందుబాటులోకి వస్తుందన్నారు. పీఎం సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గంలో పదివేల కనెక్షన్లు లక్ష్యంగా ఉన్నట్లు వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 ఎకరాల భూమిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు గేమ్ ఛేంజర్గా మారనున్నాయని స్పష్టం చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధికి బ్రాండింగ్ కల్పించేందుకు వివిధ వర్గాల మేధావుల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, *
*ఎన్టీఆర్ జిల్లా, మార్చి 29, 2025*
*తలసరి ఆదాయం, జీడీడీపీలో జిల్లాను ముందంజలో నిలపాలి*
– *ఇతర జిల్లాలతో ఆరోగ్యకర పోటీతో సమష్టి భాగస్వామ్యంతో కృషిచేయాలి*
– *స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలి*
– *అన్ని రంగాల్లోనూ 15 శాతం సుస్థిర వార్షిక వృద్ధికి మించి పురోగతికి కృషిచేయాలి*
– *జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు*
– *వినూత్న ఆలోచనతో ఖిల్లాపై డీఆర్సీ నిర్వహించడం అభినందనీయం*
– *జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్*
చారిత్రక ఔన్నత్యానికి చిహ్నమైన కొండపల్లి ఖిల్లాపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. గతంలో ఎన్నడూలేని విధంగా కొండపల్లి ఖిల్లాపై జిల్లా అభివృద్ధికి నాంది పతాక ఎగిరింది. పర్యాటక, ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో స్వర్ణాంధ్ర@2047 దార్శనికతకు అనుగుణంగా వినూత్న ఆలోచనతో శనివారం ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి కోటలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా రెండో జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశం జరిగింది. సమావేశంలో తొలుత గత నవంబర్ 30న జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన, చర్చించిన 113 అంశాలపై తీసుకున్న చర్యలను సమావేశం ముందుంచారు. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు, మిరపకు కనీస మద్దతు ధర, తుమ్మలపాలెం ఎత్తిపోతలకు విద్యుత్ సరఫరా, పోలంపల్లి ప్రాజెక్టు మరమ్మతులు, ముక్త్యాల ఎత్తిపోతల పథకం, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఏపీఐఐసీ భూముల గుర్తింపు, పెనుగంచిప్రోలు ఎత్తిపోతలకు మరమ్మతులు, నందిగామ సీహెచ్సీ అప్గ్రెడేషన్.. ఇలా వ్యవసాయ, అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాలకు చెందిన వివిధ అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. వ్యవసాయ, ఉద్యాన రైతులతో పాటు విజయవాడలోని వివిధ కాలనీల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడదపైనా, వీధి కుక్కల సమస్యపైనా సమావేశంలో చర్చించారు.
సమావేశం అనంతరం ఇన్ఛార్జ్మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా, పేదల జీవన ప్రమాణాలు పెంచాలనే సంకల్పంతో జిల్లాను అన్ని రంగాల్లోనూ పురోగతి దిశగా పయనించేలా చేసేందుకు వినూత్న ఆలోచనతో కొండపల్లి ఖిల్లాపై జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయం.. ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో జిల్లాను తలసరి ఆదాయంలోనూ, స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ముందుండేలా సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా తలసరి ఆదాయం రూ. 3,53,150గా ఉందని.. 2025-26లో తలసరి ఆదాయ లక్ష్యాన్ని రూ. 4,17,412గా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. తలసరి ఆదాయంలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని.. ఈ విషయంలో ఆరోగ్యకర పోటీతత్వంతో జిల్లాను తొలిస్థానానికి తీసుకొచ్చేందుకు, అదేవిధంగా జీడీడీపీ, జడీవీఏ లక్ష్యాలను కూడా చేరుకునేందుకు ప్రతి శాఖకు చెందిన అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకురావాలన్నారు. ప్రతిశాఖలోనూ విలువ జోడింపునకు కృషిచేసినప్పుడే.. 15 శాతం సుస్థిర వార్షిక వృద్ధిని మించి పురోగతి సాధించేందుకు వీలవుతుందన్నారు. 2025-26లో వ్యవసాయ రంగ వృద్ధిలో పురోగతి లక్ష్యం 15.94 శాతం, పారిశ్రామిక వృద్ధి లక్ష్యం 18.57 శాతం, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు రంగ వృద్ధి లక్ష్యం 22.22 శాతంగా ఉన్నట్లు మంత్రివర్యులు వివరించారు.
*రాజకీయ వివక్షకు తావులేకుండా..*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను రాజకీయ వివక్షకు తావులేకుండా చివరిమైలు లబ్ధిదారునికీ చేరువచేసేందుకు అధికారులు కృషిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పీ4 విధానాన్ని ఉగాది రోజున ఆవిష్కరించనుందని.. ప్రభుత్వ సహకారంతో పాటు ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లాను తద్వారా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా నడిపించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములుకావాలని.. ఈ గొప్ప ప్రయాణంలో అధికారులు ఉదాసీనతకు తావులేకుండా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జిల్లాలో అద్భుత పర్యాటక కేంద్రాలున్నాయని.. వీటికి ప్రాచుర్యం కల్పించేందుకు, పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలతో టెంపుల్ టూరిజం సర్క్యూట్తో పాటు సమ్మిళిత టూరిజం ప్యాకేజీలకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఉదాహరణకు ఉత్తరాంధ్ర నుంచి తిరుమల వెళ్లే భక్తుల్లో చాలామంది తిరిగి వచ్చేటప్పుడు తప్పనిసరిగా విజయవాడ అమ్మవారిని దర్శించుకుంటారని, ఈ నేపథ్యంలో భక్తులకు ఆధ్మాత్మిక, పర్యాటక మధురానుభూతిని మిగిల్చేలా ప్యాకేజీలు ఉపయోగపడతాయన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల పెద్దఎత్తున ఉపాధిసృష్టితో పాటు సంపద సృష్టికి వీలవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి, యువతలో నైపుణ్యాభివృద్ధికీ చొరవచూపుతున్నట్లు తెలిపారు.
*పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
హోటళ్లు, ట్రావెల్ అసోసియేషన్లతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో పలు దఫాల్లో సమావేశాలు నిర్వహించి మూడు రోజుల టెంపుల్ టూరిజం, నాలుగు రోజుల టూరిజం ప్యాకేజీలకు రూపకల్పన చేయడం జరిగిందని.. ఇవి మరో వారం పదిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం వాటా 2024-25లో 67.19 శాతంగా ఉందని.. 2025-26లో ఈ లక్ష్యం 67.29 శాతమని.. ఈ గణాంకాలను చూస్తే జిల్లా సేవరంగం అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయన్నారు. సేవారంగంలో ఆతిథ్యం, పర్యాటకం భాగస్వామ్యం చాలా ఎక్కువని, అందుకే ఈ రంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఓ చిన్న ఆలోచన పెద్ద మార్పునకు దారితీస్తుందని.. కొండపల్లి ఖిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం సీఎస్ఆర్ నిధులతో పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే లేజర్ షో అందుబాటులోకి వస్తుందన్నారు. పీఎం సూర్యఘర్ కింద ప్రతి నియోజకవర్గంలో పదివేల కనెక్షన్లు లక్ష్యంగా ఉన్నట్లు వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 ఎకరాల భూమిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు గేమ్ ఛేంజర్గా మారనున్నాయని స్పష్టం చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధికి బ్రాండింగ్ కల్పించేందుకు వివిధ వర్గాల మేధావుల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.