డ్రోన్ ఆపరేటర్లు గా మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ (ఉమెన్ డ్రోన్ పైలెట్స్)

0

 

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.15-11-2024

 డ్రోన్ ఆపరేటర్లు గా మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ (ఉమెన్ డ్రోన్ పైలెట్స్)

 నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ వినూత్నంగా ఆలోచించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించు కోవడం ద్వారా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ను నియంత్రించడం, నేరాలును ఛేదించడం, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు వివిధ వి. ఐ. పి ల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుంది.

 ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా మహిళా పోలీస్ కానిస్టేబుల్ లకు డ్రోన్ ఆపరేట్ చేసే విధంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలోనే మొట్టమొదటిసారిగా మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేయడం జరుగుతుంది. 

 ఈ నేపథ్యంలో కెమెరాలను ఆపరేట్ చేయడంలో శిక్షణ తీసుకున్న మహిళా పోలీసులు లైవ్ డ్రోన్ ట్రాఫిక్ సర్వేలన్స్, డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ,ఈవ్ టీజింగ్ సర్వేలన్స్, అక్రమ ఇసుక రవాణా పై , గంజాయి ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా/ సేవించడం /విక్రయించడం  

మొదలగు అంశాలపై డ్రోన్ కెమెరాల ద్వారా సర్వలెన్స్ నిర్వహించి వాటి నియంత్రించడంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

 ఈ క్రమంలో ఈ రోజు నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్. పోలీస్ కమాండ్ కంట్రోల్ నందు డ్రోన్ ఆపరేట్ చేయడంలో శిక్షణ తీసుకున్న మహిళా పోలీసుల పని తీరు పరిశీలించి వారికి పలు సూచనలు సలహాలు అందించడం జరిగింది. అదేవిధంగా శిక్షణ తీసుకున్న మహిళా సిబ్బంది నీ అభినందించడం జరిగింది. 

 ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ తో పాటు డిసిపి గౌతమి షాలి ఐ. పి. ఎస్. ఇన్స్పెక్టర్ హనీష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version