ట్రూ ఆఫ్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి.
భారాన్ని వేస్తే బషీరాబాద్ ఉద్యమమే శరణ్యం
వరదల అతివృష్టి కి నష్టపోయిన ఆటో డ్రైవర్లకు రూ 25వేల ఆర్థిక సహాయాన్ని పెంచాలి
ఎన్టీఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్.
విశాలాంధ్ర
విజయవాడ(చిట్టినగర్): ప్రజలపై మోపిన 18 వేల కోట్ల రూపాయల ట్రూ ఆప్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని, ఆటో కార్మికులకు వరదల అతివృష్టి కి నష్ట సహాయాన్ని రూ 25 వేలకు పెంచాలని ఎన్టీఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ , వామన మూర్తి డిమాండ్ చేశారు.
శుక్రవారం ఏఐటీయూసీ విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుణదల విద్యుత్ సౌధ ఎదుట విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి గూడేల జనార్ధన్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దోనేపూడి శంకర్ , వామన మూర్తి లు పాల్గొని మాట్లాడుతూ వరదల అతివృష్టి కి మూడు వేల ఆటోలు మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం కంటి తుడుపుగా చర్యగా పదివేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి చేతులు దులుపు కోగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఆటో కార్మికులతో వెళ్లి స్వయంగా కలిసి ఆర్థిక సహాయాన్ని 25 వేలకు పెంచాలని కోరమని తెలిపారు. నెలరోజులైనా ఇంకా పెంచకపోవడం దారుణమన్నారు. రాజధాని గ్రామంలో రెండు రోజుల క్రితం సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష 20 వేల కోట్ల రూపాయల డిస్కంలు అప్పులో ఉన్నాయని చెప్పటం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన 18 వేల కోట్ల ట్రూ ఆప్ చార్జీల భారాన్ని వేస్తే ప్రజలను మోసం చేయటమేనని దుయ్యబట్టారు.
ఎన్ డి ఏలో వున్న టీడీపీ, బీజేపీ జనసేన పార్టీలు ఎన్నికల వాగ్దానంలో గత ప్రభుత్వ తప్పిదాలు చేయకుండా, సరసమైన ధరకు, సోలార్ సరఫరాతో ప్రతి గడపగడపకు, పల్లె పల్లెకు, కరెంటు చార్జీల భారాలు లేకుండా అందిస్తామన్నారని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, కరెంటు చార్జీల బారాలను వేస్తే మరో బషీరాబాద్ ఉద్యమానికి బాధితులు పునరంకితమవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి వామనుమూర్తి మాట్లాడుతూ విజయవాడ ఆటో కార్మికుల శోభ నుండి ఉపశమనం కలిగించేలా వరద నష్ట సహాయాన్ని రూ 25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
అనంతరం ఏఐటీయూసీ నగర కార్యదర్శి కొట్టు రమణారావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పి సుబ్రహ్మణ్యం, కోరి వెంకచ్చి, ప్రసాద్, బి శ్రీను, చారి, కొండ, మూర్తి, వెంకన్న, టి శ్రీను, నాగేశ్వరరావు, పి శివ, కోటి, వివిధ ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు, ప్రతినిధులు, పాల్గొన్నారు.