జాతీయస్థాయి తైక్వాండో పోటీలలో పథకాలు గెలుచుకున్న

0

 ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము

    03.02.2025

జాతీయస్థాయి తైక్వాండో పోటీలలో పథకాలు గెలుచుకున్న

క్రీడాకారులను అభినందించిన పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఐ.పి.ఎస్

 జనవరి 28 మండే 30వ తారీకు వరకు హైదరాబాదులో జరిగిన జాతీయస్థాయి క్యాడిట్ (అండర్ 14) మరియు సీనియర్ విభాగాల్లో జరిగిన తైక్వాండో పోటీలల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎన్టీఆర్ జిల్లా లోని అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

 ఈ పోటీల్లో మొత్తం 16 రాష్ట్రాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో ఎన్టీఆర్ జిల్లా కు చెందిన అంకమ్మరావు తైక్వాండో అకాడమీ నందు శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు వివిధ విభాగాలలో జరిగిన తైక్వాండో పోటీల్లో పాల్గొని మొత్తం 46 పథకాలను గెలుచుకున్నారు.

 వీటిల్లో 19 బంగారు పథకాలు కాగా, 16 వెండి మరియు 11 కాంశ్య పథకాలు ఉన్నవి. 

 ఈ సందర్భంగా ది. 03.02.2025 తేదీన అంకమ్మరావు తైక్వాండో అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావు పథకాలు గెలుపొందిన క్రీడాకారులతో కలిసి పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం లో పోలీస్ కమీషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసినారు.

ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఐ.పి.ఎస్., గెలుపొందిన క్రీడాకారులతో మాట్లాడి వివరాలను తెలుసుకుని అభినందించారు. మున్ముందు ఇదేవిధంగా మరిన్ని పోటీల్లో పాల్గొని మరిన్ని పథకాలు గెలుచుకోవాలని, ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న క్రీడాకారులందరిలో ప్రతి ఒక్కరూ పథకం గెలుపొందే విధంగా శిక్షణ ఇచ్చిన అంకమ్మరావు తైక్వాండో అకాడమీ కోచ్ మలిశెట్టి అంకమ్మరావు ని ప్రత్యేకంగా అభినందించినారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version