ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం నిందితుడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం చేశారు. గతరాత్రి ఆయన ‘జైభీమ్ భారత్’ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాసరావు అమలాపురం నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ తాను పేదల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకున్నట్టు చెప్పారు. కులం కోసమో, మతం కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చట్టసభల్లో అడుగుపెట్టి పేదల సమస్యలు తీర్చాలని భావించి రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దగాపడిన శ్రీనివాసరావు దళిత, రాజ్యాంగ రక్షణ కోసం తపన పడుతున్నారని పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ చెప్పారు. పులివెందుల నుంచి తమ పార్టీ తరపున జగన్పై దస్తగిరి పోటీ చేయబోతున్నట్టు తెలిపారు.
Spread the love త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ తాజా మార్గదర్శకాలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్కుమార్ మీనా అక్కడి రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. […]
Spread the love కూటమితోనే అభివృద్ధి సాధ్యం సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనాచౌదరి […]
Spread the loveతేది:31.10.2025అమరావతి ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతాం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నవంబర్ 4 నుండి […]