కేజ్రీవాల్ అరెస్ట్ పై కపిల్ సిబల్

Spread the love

 


ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందించారు. ఏం చేయాలనే దానిపై ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వెంటనే ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు. కూటమి బలంగా ఉండాలనే విషయాన్ని తాను ముందు నుంచి చెపుతూనే ఉన్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలపై అదరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. లిక్కర్ పాలసీ కేసు జీరో కేసు అని… అప్రూవర్లుగా మారిన వారి వాంగ్మూలాల పైనే కేసు ఆధారపడి ఉందని అన్నారు. ఈ కేసులో ఆధారాలు లేవని, జరుగుతున్న తతంగం అంతా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని చెప్పారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *