ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తో లారీ ఓనర్స్
విజయవాడ జులై 2: భారతీయ జనతా పార్టీ (బి.జె.పి.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన పి.వి.ఎన్. మాధవ్ ను బుధవారం ఉదయం విజయవాడలో లారీ యజమానుల సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు, కోశాధికారి నాదెళ్ళ కృష్ణ, ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అల్లాడ సత్యనారాయణ, కార్యదర్శి రావి శరత్ బాబు, మాజీ ప్రధాన కార్యదర్శి చెన్నుపాటి వజీర్, కృష్ణా డిస్ట్రిక్ట్ ట్రక్కర్స్ ఓనర్స్ సంఘం కార్యదర్శి సూరపనేని సురేష్ ఈ సందర్భంగా మాధవ్ తో రవాణారంగ సమస్యలను ప్రస్తావించారు.