ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీనరసింహం

0

ఎన్‌టిఆర్‌ జిల్లా, 23.07.2025.

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీనరసింహం

సాధారణ తనిఖీలలో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీనరసింహం పరిశీలించారు. గోడౌన్ కు వేసిన సీల్డ్ లను, ఈవీఎంల రక్షణ భద్రత కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో డిఆర్ఓ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపించవలసి ఉంటుందన్నారు. ఈవీఎం గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహించారు.

తనిఖీలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version