ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు గొల్లపూడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ ప్రారంభం కానుంది.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత.. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ తదితరులతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 100 మంది అభ్యర్థులకు ఉచితంగా సివిల్స్ (ప్రిలిమ్స్, మెయిన్స్) శిక్షణ ప్రారంభం కానుంది.