ఇంద్రకీలాద్రి మాఘ)పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం..

0

 Dt. 12-02-2025:

(మాఘ)పౌర్ణమి సందర్బంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం..

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ 

ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. మరియు పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టం.

         ఈరోజు తేదీ.12-02-2025 న మాఘ పౌర్ణమి సందర్బంగా ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద గల శ్రీ కామదేను అమ్మవారి దేవస్థానం నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ వైదిక సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు ఈఈ కే వి ఎస్ కోటేశ్వర రావు పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం ను ప్రారంభించారు. వివిధ రకముల కళాకృతులు, నాట్యములు, మంగళవాయిద్యముల, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం సాగినది.

 భక్తులు విశేషముగా ఈ కార్యక్రమంలో భక్తులు విశేషముగా పాల్గొని, అమ్మవారిని స్వామివారిని దర్శించుకొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ , ప్రధానార్చకులు, వేదపండితులు మరియు వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version