ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో జమ్మికుంట తహసీల్దార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెయిడ్ చేశారు. జమ్మికుంటలోని తహసీల్దార్ రజని నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి తనిఖీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రజనీ నివాసంతో పాటు హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న ఆమె బంధువుల నివాసంలోనూ ఏకకాలంలో తనిఖీ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
![]()

