అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను ప్రజలను అడిగి తెలుసుకున్న విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర

0

 విజయవాడ నగరపాలక సంస్థ 

30-01-2025

అన్న క్యాంటీన్లో ఆహార నాణ్యతను ప్రజలను అడిగి తెలుసుకున్న విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర

 అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత ఎలా ఉందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా భావాజీపేటలోని గులాబీ తోట, లో ఉన్న అన్న క్యాంటీన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 ప్రజలను స్వయంగా మెనూ కు తగ్గట్టుగా ఆహారం పెడుతున్నారా, నాణ్యత ఎలా ఉంది, అన్న క్యాంటీన్ లో సమయానికి ఆహారం అందుతుందా, డబ్బులు ఎంత చెల్లించవలసి వస్తుంది, వంటి విషయాలపై ఆరా తీశారు. ప్రతి అన్న క్యాంటీన్ ను పర్యవేక్షించడానికి ఉన్న నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు నాణ్యతను, పరిశుభ్రతను చూసుకుంటూ ఉండాలని అధికారులను ఆదేశించారు.

 ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇంచార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version