ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం ,విజయవాడ.
తేదీ. 16.06.2025
అధునాతన సౌకర్యాలతో పుననిర్మించిన మహిళా పోలీసుస్టేషన్ ను ప్రారంభించిన నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.
బందర్ రోడ్డులోని పాత కంట్రోల్ రూమ్ భవనంలో ఉన్న మహిళా పోలీసు స్టేషన్ కార్యాలయంను అత్యాదునిక సౌకర్యాలతో ఆధునీకరించి పుననిర్మించడం జరిగింది. ఆధునీకరించిన మహిళా పోలీసు స్టేషన్ కార్యాలయాన్ని ఈ రోజు నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ప్రారంభించడం జరిగింది. ఆధునీకరించిన మహిళా పోలీసు స్టేషన్ లో అధికారుల రూమ్లు, కోర్ట్ రూమ్, రిసెప్షన్, మహిళా హెల్ప్ డెస్క్ కౌన్సిలింగ్ సెంటర్ లతోపాటు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్, పిల్లల కోసం ప్రత్యేకంగా చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ప్లే రూమ్ లను మొదలగు విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. డి.సి.పి.లు కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. ఎ.బి.టి.ఎస్. ఉదయారాణి ఐ.పి.ఎస్. కృష్ణమూర్తి నాయుడు ఎస్.వి.డి.ప్రసాద్ ఎ.డి.సి.పి.లు ఎ.వి.ఎల్ ప్రసన్న కుమార్ ఎ.సి.పి.లు లతా కుమారి స్రవంతి రాయ్ పావన్ కుమార్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. సిబ్బందితో మాట్లాడుతూ మహిళలు మరియు బాలికల యొక్క రక్షణ కొరకు ప్రత్యేకంగా మహిళా పోలీసు స్టేషన్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడకు వచ్చే బాధితులు స్వాంతన పొందేలాగా సంవ్యవనం పాటిస్తూ మర్యాధగా మాట్లాడాలి, బాధితులకు మనం అండగా ఉన్నామనే భావన వచ్చేవిధంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహించాలి. నేరస్తులకు కచ్చితంగా శిక్ష పదేవిధంగా చర్యలు తీసుకోవాలి. టెక్నాలజీ ఆధారంగా చేసుకుని సాక్ష్యాలను సేకరించి ముందుకు వెళుతూ ఎట్టి పరిస్థితులలో కూడా నేరస్థుడు నేరం చేయాలంటే భయపడేలాగ, నేరం జరిగితే కచ్చితంగా 24 గంటల లోపే నేరస్థుడిని గుర్తించేలాగా ఆపద సమయాలలో బాధితులకు (మహిళలు/బాలికలకు) మేము ఉన్నాం అనే భరోసా కల్పించే విధంగా విధులు నిర్వహించాలని తెలియజేశారు.