Home Andhra Pradesh అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్

అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్

4
0

అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్

  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైంది
    • పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు వ్యయం
    • రాష్ట్రవ్యాప్తంగా పశువుల కోసం నీటి తొట్టెలు, ఏజెన్సీవాసుల డోలీ కష్టాలు తీర్చేందుకు రోడ్ల నిర్మాణం చేపట్టారు
    • ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు

‘న్యూక్లియర్ అనగానే అది ఒక పేలుడు పదార్థం అనే భావన మాత్రమే సాధారణంగానే అందరిలో ఉంటుంది, న్యూక్లియర్ అంటే అణుశక్తి. అణుశక్తి వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇది కార్బన్-రహిత శక్తి వనరు, పర్యావరణానికి మంచిది, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సమర్థవంతమైన మార్గం, ఇంకా ఇది వైద్య రంగంలో, పరిశ్రమలలో ఉపయుక్తమవుతోంది. అణుశక్తి ద్వారా నీటిని కూడా శుద్ధి చేయవచ్చు. అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్.ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలతో జరిగిన వర్చువల్ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ.. జనసేన పార్టీపై అభిమానంతో పార్టీకి ఆర్థిక సహకారం అందజేస్తున్న ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్. ఆర్.ఐ. జన సైనికులు, వీర మహిళలకు నాగబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ఏడాది కాలంలోనే ప్రజలకు చేరువైందని చెప్పారు. పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రిగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో సఫలీకృతం అవుతున్నారని, “తల్లికి వందనం” పథకంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు గానూ రూ. 10,091 కోట్లు ఒకే రోజు అర్హుల ఖాతాల్లో జమ చేయడం అద్భుతమైన అంశమని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజు 80 శాతం మంది పిల్లలకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేయటం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టడం అభినందనీయమని, ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్ర గణనీయమైందని, 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వినూత్నమైన సంస్కరణలతో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.
ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కేవలం ఒక్క ఏడాదిలోనే రూ. 308 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల మన్ననలు అందుకున్నారని అన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిపై కూడా ఎక్కువ దృష్టి సారించాలనే కూటమి ప్రభుత్వం ఆలోచనల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రవాణాకు ప్రధాన వనరు అయిన రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణం, ఏజెన్సీవాసుల డోలీ కష్టాలు తీర్చేందుకు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారుల నిర్మించే ప్రక్రియను చేపట్టారని చెప్పారు. సర్పంచుల వినతి మేరకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, జాతీయ పండుగలైన స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం వేడుకలకు ప్రతీ ఏడాది గ్రామస్థాయిలో రూ. 10 వేలు, మండల స్థాయిలో రూ. 25 వేలు కేటాయించిన ఘనత పవన్ కళ్యాణ్ కి దక్కుతుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తోందని, అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే ‘పేదల సేవలో’, ‘పెన్షన్లు, ‘అన్న క్యాంటిన్లు’, దీపం-2, ‘తల్లికి వందనం’, ‘మత్స్యకార సేవలో’ లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామని అన్నారు. మెగా డిఎస్సీతో దాదాపు 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టామని, రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడినపెట్టి, రైల్వే జోన్ సాధించడం, స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here