రేషన్ కార్డుల దరఖాస్తుకు గడువు లేదు..ఇది నిరంతర ప్రక్రియ ప్రజలు తొందరపడకండి..అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రైస్ కార్డులుపౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్విజయవాడ 22-5-2025నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మరియు మార్పులు చేర్పులకు గడువు లేదు.. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.ఈరోజు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డులు దరఖాస్తు మార్పులు చేర్పులకు సంబంధించి గడువు అంటూ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రైస్ కార్డులు అందిస్తాం అన్నారు. కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడా ఎటువంటి జాప్యం లేదు. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టమన్నారు. గత రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదు అన్నారు. ఈకెవైసీ తప్పని సరి అని కేంద్రం స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశాం. దేశంలో 95శాతం ఈకేవైసీ పూర్తిచేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. 4.24.59,028 మందికి ఈకేవైసీ పూర్తి అయ్యింది. 22,59,498 మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదు. అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారు. దీంతో సర్వర్ స్లో కావడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అరవై వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు.. ఉన్న కార్డు నుంచి తొలగింపు కోసం 44వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.. అడ్రస్లు మార్పులు కోసం 12,500 మంది ధరఖాస్తు చేసుకున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అనుసంధానం చేయడం జరిగిందన్నారు. గత పదిహేను రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం…సర్వర్ డౌన్ కావడం, సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేక పోవడం వంటి వాటితో ఇబ్బంది కలిగిన విషయం మా దృష్టికి వచ్చిందన్నారు.. సాంకేతికపరమైన లోపాలతో వల్ల ఇబ్బంది కలిగినందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం. మూడు రోజులుగా కమీషనర్, ఇతర అధికారులు ఖాళీ లేకుండా పని చేస్తూ..అందరితో మాట్లాడి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.4,24,59,128 మందికి జూన్ మాసంలో మేమే ఉచితంగా రైస్ కార్డులను అందజేస్తున్నాం. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరూ ఆందోళన చెందకండి.. మార్పులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కార్డుదారుల సమాచారం డేటా బేస్ లో పెట్టి.. ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అందిస్తాం అని స్పష్టం చేశారు.మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదు.. పెళ్లి సంబంధించి ఫొటో కూడా అక్కర్లేదు. రైస్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి మ్యారెజ్ సర్టిఫికేట్ అవసరం లేదు అని తెలిపారు.. పెళ్లి సంబంధించి పొటో కూడా అక్కర్లేదు అన్నారు. వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. కొన్ని ప్రాంతాలలో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇస్తున్నట్లు తెలిసింది.. ఇక అలా చేయకండి అన్నారు. కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే నమోదు చేయాలని సూచించారు. ఒక పేరు తొలగించాలంటే.. తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి. పేరు తొలగింపు సంబంధించి డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నామన్నారు. ప్రజలు ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఉంటే.. వారి రేషన్ కార్డులు సరైన కారణం ఉంటే డిలీట్ చేసేందుకు ఆప్షన్ ఇస్తున్నాం.మహిళలు, స్త్రీలుతో పాటు, ట్రాన్స్ జెండర్స్ కు కూడా అవకాశం కల్పించాం.కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో మాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ను బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నట్టు వివరించారు. రైస్ కార్డు సరెండర్ చేయాలనుకుంటే.. కుటుంబం మొత్తం కలిపి చేయవచ్చు అని తెలిపారు. కానీ కొంతమంది ఆ కార్డులో వ్యక్తులను మాత్రమే తొలగించాలని చూస్తున్నారు.. అది ఇప్పుడే సాధ్యం కాదు అన్నారు.వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. సర్వర్ సమస్యలతో చాలాసార్లు ఇబ్బందులు పడుతున్నారుత్వరలోనే దీనిని సరి చేసి.. మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఈకెవైసీ, ఆధార్ సీడింగ్ లో మార్పులు, రైస్ కార్డు సరెండర్ చేసుకునే అవకాశాలు వాట్సప్ ద్వారా చేసుకునేలా విధంగా సేవలు అందిస్తామన్నారు.వాట్సప్ ద్వారానే మెరుగైన సేవలు అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరబ్ గౌర్ ఐఏఎస్ కూడా ఉన్నారు.
