బంగారం గని కూలిన ఘటనలో 11మంది మృతి
Jun 30, 2025,
బంగారం గని కూలిన ఘటనలో 11మంది మృతి
తూర్పు సూడాన్లో ఓ బంగారు గని పాక్షికంగా కూలిన విషాద ఘటనలో 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారంతా మైనింగ్ వర్కర్లే. తూర్పు నైలు నది ప్రావిన్స్లోని హౌయిడ్ పట్టణంలో భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో కెర్ష్ అల్-ఫీల్ గని కూలిపోయినట్లు సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రిలో చేర్చించినట్లు పేర్కొంది.