20-08-2025
దేశాభివృద్ధి తో పాటు ప్రజల ఆరోగ్యాభివృద్ది డబుల్ ఇంజన్ సర్కార్ తో నే సాధ్యం : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి..
ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని
విజయవాడ : దేశ, రాష్ట్రాభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యాభివృద్ది డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం..
మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతి ఒక్కరి జీవితంలో యోగ భాగం కావాలి.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నిత్యం ఉదయం పూట యోగాసనాలు సాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత లభిస్తుందని ఎంపీ వెల్లడించారు. ప్రస్తుత యాంత్రికరణ జీవితంలో దీర్ఘకాలిక రుగ్మతల నుంచి ఉపశమనం లభించడానికి యోగ దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఎంపీ తెలిపారు.యోగ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించేలా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014లో జరిగిన యూఎన్ ప్రసంగంలో చొరవ తీసుకున్నారని, దీనికి సంబంధించిన తీర్మానానికి ప్రపంచవ్యాప్తంగా విస్తృత మద్దతు లభించిందని ఎంపీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 177 దేశాలు దీనికి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు.
ఇదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని చరిత్రలో నిలిపేలా విశాఖపట్నం వేదికగా ఏర్పాట్లు చేసిందని ఎంపీ పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీ కోరారు.