Home Andhra Pradesh ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది : యార్లగడ్డ

ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది : యార్లగడ్డ

4
0

ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది : యార్లగడ్డ

గన్నవరం :
అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడం ద్వారా ప్రపంచం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం 11వ ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన యార్లగడ్డ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3లక్షల మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించామని, ఇవి తెలుగు వారందరూ గర్వపడేక్షణాలుగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావడం సంతోషకరమన్నారు. మన దేశ వారసత్వ సంపద అయిన యోగాను ప్రపంచానికి అందించి జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం గా నిర్వహించేందుకు ప్రధాని మోడీ చేసిన కృషి మరువలేనిదాన్నరు. మోడీ చేసిన కృషి వల్ల ప్రపంచంలో అన్ని దేశాల్లో యోగా సాధన చేస్తున్నారని తెలిపారు. శారీరక, మానసిక, ప్రశాంతతకు యోగ ఉపకరిస్తుందని అనునిత్యం యోగ సాధన చేయడం ద్వారా పలు రుగ్మతలను అదుపులో ఉంచుకోవచ్చు అన్నారు. దైనందిని జీవితంలో ఎంతో ఉపయోగకరమైన యోగాను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిత్యం యోగ సాధన చేయడం ద్వారా పని ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో యోగాను భాగంగా చేసుకోవటం అత్యవసరం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి పథంగా అట్టడుగు స్థానానికి చేరుకుందని, వైసిపి ప్రభుత్వ వేధింపులు పడలేక పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని గుర్తు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలకు భరోసానివ్వటంతో పాటు వారికి పలు ప్రోత్సాహకాలను ఇచ్చి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నామని యార్లగడ్డ తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేశారని ఇందుకు అనుగుణంగా నియోజకవర్గంలో మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెంకట్రావ్ వివరించారు. మరో 18 నెలల్లో ఈ రెండు పారిశ్రామిక వాడల్లోనూ పూర్తిస్థాయిలో పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని యార్లగడ్డ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిరుమామిళ్ల సూర్యం, మేడెపల్లి రామ, దయాల రాజేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు పడమట రంగారావు, కసారినేని రంగబాబు, కుందేటి చంద్రశేఖర్, మున్న రామకృష్ణ, అట్లూరి నాని, కొండపల్లి వెంకన్న, బుల్లియా, సతీష్, బీజేపీ నాయకు చిగురుపాటి కుమారస్వామి, కానూరి శేషు మాదవి, మోహన్ , చందు రెడ్డి , జనసేన నాయకులు చీమాట రవి వర్మ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here