Home Andhra Pradesh తల్లికి వందనం” అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది – MLA...

తల్లికి వందనం” అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది – MLA బొండా ఉమ

3
0

17-6-2025

ఎటువంటి పబ్లిసిటీ లేదు ఏ నాయకుడి ఫోటో లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు – డొక్కా సీతమ్మ పేర్ల తో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం – MLA బొండా ఉమ

“తల్లికి వందనం” అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది – MLA బొండా ఉమ

ధి:17-6-2025 మంగళవారం ఉదయం 10:30″గం లకు ” 25వ డివిజన్ అరండల్ పేట, APJ అబ్దుల్ ఖాలం ఉర్దూ హైస్కూల్ నందు 10th క్లాస్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్టూడెంట్ పాఠ్యపుస్తకాలు, వర్క్, నోటు పుస్తకాలు, యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్సులతో సహా రూ. 2,279 విలువైన కిట్ లను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేయడం జరిగినది

ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేస్తామని సూపర్ 6లో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తున్నాము అని, గత ప్రభుత్వంలో ఒక్కో ఇంటికి ఒక విద్యార్థికే ఈ పథకం వర్తింపచేసింది అని

విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ప్రభుత్వం పనిచేస్తుందని, విద్యార్థులకు కావలసినటువంటి అన్ని మౌలిక వసతులు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, షూస్ వాటితోపాటు తల్లికి వందనాలు పడిపోయి కింద ఒక్కొక్కరికి ₹13 వేల రూపాయలు వారి తల్లి అకౌంట్లోనే జమ చేస్తున్నామని, ఎవరికైనా అకౌంట్లలో నిధులు జమకానిపక్షంలో జూన్ 26 వరకు ప్రభుత్వం సమయం ఇచ్చిందని బొండా ఉమా తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు మాచర్ల గోపినాధ్,మహిళ నాయకురాలు మాచర్ల పావని,డివిజన్ ఇంచార్జి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి ఇనుకుల సాయిబాబు,విజయకృష్ణ సూపర్ బజార్ డైరెక్టర్ దొంగర ఆంజనేయులు,సామ్రాజం,సీతమహాలక్ష్మి,బుజ్జి,గీదా.దుర్గరెడ్డి,,పబ్బతి రాము, కృష్ణ,ఉట్టి.శ్రీనివాస్,బాలాజీ,
సత్తి,సాయి,గిరి,మున్నా తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here