ఎన్టిఆర్ జిల్లా
తేది: 17.06.2025
కళత్మాక యోగా అదరహో విజేతలకు అవార్డుల పంపిణీ.జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
యోగాంధ్ర 2025లో భాగంగా జిల్లాలో మూడు రోజుల పాటు వివిధ అంశాలలో యోగాసనాలపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళత్మాక యోగా పోటీలు అదరహో.. అనిపించాయని, న్యాయ నిర్ణేతల సమక్షంలో పారదర్శకంగా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.
అంతార్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర 2025లో భాగంగా మంగళవారం స్థానిక కలెక్టరేట్లో రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి చేసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియలు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేది బుధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్విహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో యోగాసనాలకు సంబంధించి పలు అంశాలపై గ్రామ, మండల, పట్టణ జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించి జిల్లా స్థాయిలో విజేతలైన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి ఇబ్రహీంపట్నం మండలం గుటుపల్లి డాన్బాస్కో స్కూల్ నందు న్యాయ నిర్ణేతల సమక్షంలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించి ఎంపిక చేయడం జరిగిందన్నారు. యోగా నృత్యం, యోగా చిత్రలేఖనం, యోగా ఫోటోగ్రాఫీ, యోగా స్లోగన్, వంటి అంశాలపై రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రతి సచివాలయ పరిధిలో ప్రజలకు యోగాసనాలపై శిక్షణ ఇచ్చామన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు 15 కేటగిరిలో జూనియర్, యంగ్, సీనియర్ గ్రూపులలో గెలుపొందిన విజేతలు మండల, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి చేరుకున్నారన్నారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొంటారని, అనంతరం సాంస్కృ తిక కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ అన్నారు.
సమావేశంలో విజయవాడ ఆర్డివో కె. చైతన్య, డిఇవో యు.వి. సుబ్బారావు ఉన్నారు.