16-6-2025
అభివృద్ధి పనుల పేరుతో సూర్యారావు పేట ప్రాంతంలో వేసిన రహదారులు నాణ్యత లేకుండా వేసి నాటి వైయస్సార్సీపి ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు – MLA బొండా ఉమ
ప్రజల కోరిక మేరకు మరలా ఆయా రహదారులను నాణ్యత ప్రమాణాలకు లోబడి టిడిపి కూటమి ప్రభుత్వం వేస్తోంధి – MLA బొండా ఉమ
ధి:16-6-2025 సోమవారం ఉదయం 9:30″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గం లోని 23 వ డివిజన్ సూర్యారావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర నుండి రెండో సందు చిలుకు దుర్గయ్య వీధి ప్రాంతంలో ₹60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నాలుగు రహదారులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామితో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన యాడాది కాలంలో ₹240 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, గత వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాలన లో ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, ప్రజా సమస్యలపై తనకు అన్ని డివిజన్ లలోనూ పరిపూర్ణ అవగాహన ఉందని, ఆయా ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు
ఎన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించైనా సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, సూర్యారావుపేటలో ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన రహదారులు రాబోయే 30, 40 సంవత్సరాల వరకు చెక్కు చెదరని రీతిలో ఉంటాయని, న్యాన్యత విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా రహదారులను నిర్మించినట్లు తెలియజేసారు
స్థానిక డివిజన్ కార్పొరేటర్, టిడిపి ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ:- ప్రజల సమస్యలు నిరంతరం తెలుసుకుంటూ పని చేసే ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని, తమ డివిజన్ లో సుమారు ₹3 కోట్ల రూపాయల పైబడి వ్యయంతో ఇటీవల అభివృద్ధి పనులు జరిగాయి అని, ఏ ప్రజా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే పరిష్కరిస్తున్నారని, డివిజన్ ప్రజల పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బాలస్వామి తెలియజేసారు
ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్స్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, కృష్ణ కాంత్, గిరిదర్ క్రాంతి కిషోర్, బసవేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు