Home Andhra Pradesh నాణ్యతతో అర్జీల పరిష్కారం ఉండాలి. పునరావృతం కాకుండా సమస్య పరిష్కరించాలి. జిల్లాలో 157 ఆర్జీల నమోదు. జిల్లా...

నాణ్యతతో అర్జీల పరిష్కారం ఉండాలి. పునరావృతం కాకుండా సమస్య పరిష్కరించాలి. జిల్లాలో 157 ఆర్జీల నమోదు. జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

3
0

విజయవాడ తేది 16.06.2025 నాణ్యతతో అర్జీల పరిష్కారం ఉండాలి. పునరావృతం కాకుండా సమస్య పరిష్కరించాలి. జిల్లాలో 157 ఆర్జీల నమోదు. జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ నాణ్యతతో ఆర్జీలకు పరిష్కారం చూపాలని, పునరావృతం కాకుండా సమస్యను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ అన్నారు. ప్రతీ సోమవారం నిర్వహించే పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెసల్‌ సిస్టమ్‌ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది నుండి సమాచారం సేకరించి పరిష్కారం చూపాలన్నారు. ఆర్జీలు ఏ స్థాయిలోను పునరావృతం కాకూడదని, సమస్య పరిష్కారంతో అర్జిదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పని చేసి ప్రభుత్వ నిర్థేశించిన లక్ష్యాన్ని నేరవేర్చాలని అన్నారు. ప్రతి ఆర్జీకి అర్థవంతమైన సమాదానం ఇస్తూ పరిష్కరించాలని ఆర్జీలను ఆడిటింగ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఆర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం తగదన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో వచ్చే ఆర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని, ప్రతి సమస్యను శ్రద్దగా విని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 45, పోలీస్‌ శాఖకు 19, ఎంఎయుడి 17, విద్య 16, ఏపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐఎస్‌ 10, డిఆర్‌డిఏ 9, పౌరసరఫరాలు 4, ఏపిసిపిడిసిఎల్‌ 3, హెల్త్‌ 3, పంచాయతీరాజ్‌ 3, ఆర్‌అండ్‌బి 3, ఆర్‌డబ్యుఎస్‌ 3, కళాశాల విద్య 2, విభిన్నప్రతిభావంతులు 2, గ్రామ వార్డు సచివాలయం 2, ఇంటర్మీడియట్‌ 2, మార్కెటింగ్‌ 2, గనులు మరియు భూగర్భ 2, రిజిస్టేషన్‌ 2, నైపుణ్య అభివృద్ధి 2, సర్వే 2, వ్యవసాయం, బ్యాంకు రిలెటెండ్‌, కో`ఆపరేటివ్‌, మెప్మాకు సంబంధించిన ఒక్కొక్క అర్జీతో కలిపి మొత్తం 157 అర్జీలను స్వీకరించడం జరిగిందని ఇందులో 42 అర్జీలను స్వయంగాను 115 అర్జీలను అన్‌లైన్‌ ద్వారా స్వకరించిన్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. ఇలక్కియ తెలిపారు. అర్జీల స్వీకరణలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వి నాంచారరావు గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here