సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా
కలిసిన మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి)ను మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, పశ్చిమ నియోజకవర్గ కూటమి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
మే నెలలో ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా చౌదరి
కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం తిరిగి కోలుకున్నారు..
ఆయనను సోమవారం మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కూటమి నేతలతో హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్యే సుజనా వారిని ఆప్యాయంగా పలకరించారు.
పశ్చిమ నియోజకవర్గ టీడీపీ మహిళా నేత చింతలపూడి బేబీ రత్నకుమారి ,తదితరులు ఉన్నారు..