Home Andhra Pradesh ప్రతి ఫిర్యాదును శాశ్వతంగా పరిష్కరించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

ప్రతి ఫిర్యాదును శాశ్వతంగా పరిష్కరించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

2
0

విజయవాడ నగరపాలక సంస్థ
16-06-2025

ప్రతి ఫిర్యాదును శాశ్వతంగా పరిష్కరించాలి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు.

ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను, శాఖధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తమ స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియపరిచారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 14 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 6, ఇంజనీరింగ్ 2 , రెవెన్యూ సంబంధించినవి 2, వైద్య & ఆరోగ్యం 3, ఎస్టేట్ 1 మొత్తం కలిపి 14 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రాజెక్ట్. డాక్టర్ డి చంద్రశేఖర్ తో చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి. సత్యకుమారి,పి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here