తెనాలి లో దళిత యువకులపై తాలిబన్ దాడిని నిరసిస్తూ ఈనెల 28న చలో తెనాలి.. – విజయవాడ ప్రెస్ క్లబ్లో దళిత ప్రజా సంఘాల పిలుపు తెనాలిలో దళిత యువకులపై తాలిబన్ పోలీస్ దాడిని నిరసిస్తూ ఈనెల 28వ తేదీన చలో తెనాలి పిలుపునిస్తున్నట్లు శనివారం విజయవాడలో ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరైన దళిత ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తెనాలిలో పోలీసు అధికారులు ప్రోత్సాహంతో కొంతమంది పోలీసులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని అందుకు చెడు వ్యసనాలకు గురి అయిన కొంతమందిని వాడుకుంటూ పోలీస్ మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారు. అలాగే రెండు నెలల క్రితం తెనాలి అయితనగర్లో అంబేద్కర్ విగ్రహం తొలగించే విషయంలో పోలీస్ అధికారులకు స్థానిక దళితులకు మధ్య వివాదం ఉందన్నారు. తెనాలి స్థానిక శాసనసభ్యుడు మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రోత్బలంతోనే తెనాలి దళిత యువకులపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు దళిత యువకులపై 2 టౌన్ సీఐ రాములు నాయక్ 3 టౌన్ సీఐ రమేష్ బాబు లు దాడి చేశారన్నారు. నేరం చేస్తే కేసులు పెట్టి కోర్టులో శిక్షలు వేయించాలి కానీ పోలీసులకు కొట్టే అధికారం లేదన్నారు. తాలిబన్లు తరహా ఆటవిక దాడులు రాజ్యాంగ రక్షకులైన పోలీసు అధికారులు చేయటం చట్ట విరుద్ధమన్నారు. పోలీసులు కొడితే తప్పేముంది అన్న హోం మంత్రి అనిత వ్యాఖ్యలు చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చీఫ్ ఇంటెలిజెన్సీగా ఆఫీసర్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు కూడా పోలీసులు పబ్లిక్ ప్లేస్ లో కొట్టడం నేరమని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మాట్లాడిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోవాలన్నారు. తెనాలి యువకుల పోలీసు దాస్తీకంపై సమగ్ర విచారణ చేసేందుకు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని సమావేశం డిమాండ్ చేసింది. అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని తెనాలి సిఐలు రాములు నాయక్ రమేష్ బాబులను ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం అరెస్టు చేయాలని ఒంగోలులో గంజాయి బ్యాచ్ ఒకరినొకరు కొట్టుకొని మూత్రం పోసుకున్న ఘటనలో సంబంధంలేని ఒంగోలు తాలూకా సిఐ రాంబాబు ఎస్ఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. కానీ తెనాలిలో దళిత యువకులపై బహిరంగ దాడి చేసిన ఖాకి కిరాతకులను మాత్రం సస్పెండ్ చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలే రెండు నెలల పాటు జైలుకు వెళ్లి వచ్చాడని హోం మంత్రి అనిత పై 23 కేసులు ఉన్నాయని ఆమె స్వయంగా చెప్పిందన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కూడా రౌడీషీట్ ఉందన్నారు. ఒంగోలులో రౌడీ షీటర్ ముప్పవరపు వీరయ్య చౌదరి పాడీ మోసి పరామర్శించిన చంద్రబాబు నాయుడు తెనాలి యువకులను రౌడీలు అంటo హాస్యాస్పదమన్నారు. కావున పై డిమాండ్ల సాధనకై తెనాలి దళిత మైనారిటీ యువకులపై పోలీసు దాస్తీకాన్ని నిరసిస్తూ ఈ నెల 28వ తేదీన చలో తెనాలి పిలుపును జయప్రదం చేయాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా జరుగుతున్న చలో తెనాలి కార్యక్రమానికి రాజకీయ పార్టీ నాయకులు, విప్లవ సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, మైనార్టీ సంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. దళిత పరిరక్షణ సమితి అధ్యక్షులు నేలం నాగేంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు రాష్ట్ర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, వి సి కె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరు పోగు వెంకటేశ్వరరావు, కోడి కత్తి శ్రీను కేసు న్యాయవాది సలీం, వివిధ సంఘాల నాయకులు పేరూరి మురళి కుమార్ రమణకుమారి బుట్టి రాయప్ప తుల్లిబిల్లి అశోక్ బాబు నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు