పత్రికా ప్రకటన
14 June 2025
సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి
సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై 30 సంఘాలు కలిపి విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో సమావేశం తమ ప్రధాన డిమాండ్లు అయిన సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ అమలు, సర్వీస్ నిబంధనలు, స్పష్టమైన జాబ్ చార్ట్లు అమలు, ప్రమోషన్లు అంతర్ జిల్లా బదిలీలు, సొంత మండలంలో ఉద్యోగం చేసుకుని వెసులుబాటు కల్పించాలనే డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. అలాగే జూలై 12వ తేదీన విజయవాడలో జరుపుకునే
మొట్టమొదటి పదివేల ఉద్యోగులతో ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయాలని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే స్వర్ణాంధ్ర 2047 లో సచివాలయ ఉద్యోగులందరినీ భాగస్వామిగా చేయాలని మా యొక్క సహకారాన్ని ప్రభుత్వం అందజేస్తానని సభ ముఖంగా తెలియచేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జి జోసెఫ్ కిషోర్, టి కోటేశ్వరరావు, టి ప్రభాకర్, వి శ్రీనివాస్, ఎం రాజ్యలక్ష్మి, టి దుర్గాప్రసాద్, పి నరసింహారావు, అప్పికట్ల కిషోర్, కె వి రాజేష్ బాబు, k s k వెస్లీ, జయకర్, మహబూబ్ బాషా, అనుషా, అనురాధ, షణ్ముక్, పి రాజు, దుర్గా ప్రసాద్, వెంకటేశ్వర్లు, రాజు, మజిమున్నిసా, తిరుమున్నిసా, సత్యనారాయణ, మొజెస్ తదితరులు పాల్గొన్నారు.