Home Andhra Pradesh విజయవాడ ప్రెస్ క్లబ్ పై ఇరు పక్షాలు కలసి మాట్లాడుకోవాలి

విజయవాడ ప్రెస్ క్లబ్ పై ఇరు పక్షాలు కలసి మాట్లాడుకోవాలి

2
0

విజయవాడ ప్రెస్ క్లబ్ పై ఇరు పక్షాలు కలసి మాట్లాడుకోవాలి
**త్వరలో ఇరుపక్షాలను పిలుస్తా
**సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి

విజయవాడ,జూన్ 14:విజయవాడ ప్రెస్ క్లబ్ ను అందరి ప్రెస్ క్లబ్ గా మార్చేందుకు న్యాయపోరాటం చేస్తున్న విజయవాడ ప్రెస్ క్లబ్ సాధనా సమితి ఆధ్వర్యంలో సమాచార శాఖ మంత్రి పార్థ సారధిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ ప్రెస్ క్లబ్ విషయంపై ఇరుపక్షాల కూర్చోని మాట్లాడుకోవాలని అందుకు మేము ఇరుపక్ష లను పిలుస్తామని అన్నారు. జర్నలిస్టులందరు కలసి ఉండాలని అన్నారు జర్నలిస్టు సంక్షేమ కోసం తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.ప్రెస్ క్లబ్ అందరిది అయితే విజయవాడ జర్నలిస్టులకు మేలు జరుగుతుందని, సమర్థమంతమైన నాయకత్వంలో జర్నలిస్టులకు భద్రత, సంక్షేమం ఏర్పడుతుందని విజయవాడ ప్రెస్ క్లబ్ సాధనా సమితి సభ్యులు మంత్రికి వివరించారు.అందుకు స్పందించిన మంత్రి ఇరుపక్షాలను పిలవాల్సిందిగా అడిషనల్ సెక్రెటరీ అనిత కు ఆదేశాలు జారి చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ప్రెస్ క్లబ్ సాధనా సమితి సభ్యులు వీర్ల శ్రీరామ్ యాదవ్,కూర్మ ప్రసాద్ బాబు,కే.నమ్మయ్య,ఎ.వి.వి.శ్రీనివాసరావు,మండవెల్లి మహేష్ కుమార్ మానేపల్లి మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here