Home Andhra Pradesh రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

2
0

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి

  • కలెక్టర్ లక్ష్మీషా పిలుపు
  • రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానశిబిరం

విజయవాడ,జూన్ 14:
సాటి మనిషికి అందించే సాయం ఏదైనా గొప్పదే. అదే ఓ నిండు ప్రాణాన్ని కాపాడే సాయం అయితే దాని విలువ మరింత పెరుగుతుంది. రక్తదానం కూడా అలాంటి సాయమే అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కొండపల్లిలోని బీపీసీఎల్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ రక్తదాన శిబిరానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మి షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం అనేకమంది రోగులకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు. ఈరోజు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందించారు. రక్తం ఇవ్వండి ఆశ కల్పించండి అనే అంశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపునకు స్పందించి ఎన్టీఆర్ జిల్లాలో సొసైటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. రక్తం ఇచ్చి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడండి అని కలెక్టర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ వై చైర్మన్ డాక్టర్ వెలగా జోషి మాట్లాడుతూ అత్యవసర సమయంలో అవసరమైన రక్తం లభించక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎన్టీఆర్ జిల్లాలో జరగకుండా ఉండటానికి రెడ్ క్రాస్ తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల బ్లడ్ నమూనాలు సేకరించి అందుబాటులో ఉంచుతామని, అత్యవసర సమయంలో రెడ్ క్రాస్ ద్వారా రక్తాన్ని అందుబాటులో ఉంచి మనిషి విలువైన ప్రాణాన్ని కాపాడటానికి తమవంతు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు .దీనికి జిల్లా కలెక్టర్ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో బిపిసిఎల్ నుంచి ఆదిత్య కుమార్ వర్మ, వనము లోహిత్, వేణుగోపాల్ స్వరాజ్, రామ్ టేకే హాజరయ్యారు. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చిట్టిబాబు, డాక్టర్ మదన్ హాజరయ్యారు ..ఈ శిబిరంలో 24 మంది బీపీసీఎల్ సిబ్బంది రక్తదానం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మొక్కనాటారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here