ఆలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూడాలి, టీమ్ వర్క్ చేయాలి.
- ఈవో శీనానాయక్
ఇంద్రకీలాద్రి క్షేత్రంలో పనిచేసే ప్రతీ ఉద్యోగి క్షేత్రస్థాయిలో పరిస్థితి గమనించి, టీమ్ వర్క్ చేసి భక్తుల సంతృప్తి స్థాయి పెంచాలని ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ అన్నారు.
శనివారం సాయంత్రం బదిలీపై వచ్చిన, కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఆలయ సిబ్బందితో సమావేశం జరిపారు.ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, పని చేయని వారిని ఉపేక్షించలేనని, ప్రతి వారం ప్రధాన దేవాలయాల ర్యాంకింగ్ ను ప్రభుత్వం పరిశీలిస్తుందని,సిబ్బంది పనితీరు పైనే దేవాలయం ర్యాంకింగ్ ఆధారపడియుందని అన్నారు.
ఈవో శీనా నాయక్ నిర్దేశం పాయింట్స్
- ఎ.ఇ.ఓ.లు, సూపరింటిండెంట్లు, గుమాస్తాలు ఫీల్డ్ లెవల్ ఇన్స్పెక్షన్స్ చేయవలెను.పనికిరాని వస్తువులు, ఉపయోగించని వస్తువులు ఎక్కడపడితే అక్కడ ఉండి దేవస్థాన ఆధ్యాత్మికతను దెబ్బతీస్తున్నాయి.వాటిని తీసివేసి శుభ్రంగా ఉంచాలి.
- శానిటేషన్, సెక్యూరిటీ,తదితర వ్యవస్థలు మీద సిబ్బందికి పరిశీలన ఉండాలి.
- టోల్గేట్, పార్కింగ్, షాపులు వారిమీద దేవస్థానం నియంత్రణ లేకుండా ఉంటే వారు ఇష్టానుసారం వ్యవహరిస్తే చెడ్డపేరు దేవస్థానం పొందుతుంది.ఇది బాధ కలిగిస్తుంది. భక్తులను ఇబ్బందిపెట్టకుండాచూడాలి.
- భక్తుల నుండి మంచి ఫీడ్ బాక్ రావాలి, భక్తుల నుండి ఫీడ్ బాక్ తీసుకుని ప్రభుత్వానికి పంపడం అందరి బాధ్యత ఓవర్ ఆల్ ఫీడ్ బ్యాక్ లో దుర్గమ్మగుడి మంచి స్థానంలో ఉండాలి
- దేవస్థానం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఉన్నత స్థాయిలో పిర్యాదులు ఉన్నాయి. కచ్చితంగా మార్పురావాలి.
- వృద్ధులు, వికలాంగుల వాహనాలు సరిగ్గా నడపాలి, భక్తులతో గౌరవంగా వ్యవహరించకపోతే ఇబ్బంది తప్పదు.
- ఇ.ఓ.ఆదేశాలు, ప్రభుత్వ సమీక్ష ఆదేశాలు సిబ్బంది ఖచ్చితంగా పాటించాలి.
సెక్షన్స్ వారీగా సిబ్బంది తీసుకోవలసిన చర్యలు
1) సి హెచ్ రంగారావు, అసిస్టెంట్ కమిషనర్.
లీజస్, ల్యాండ్స్, లీగల్
సెక్షన్స్
పాయింట్స్ : దేవస్థానం ల్యాండ్స్ కౌలు, లీజులు స్టేటస్ సమర్పించవలెను. ఇటీవల కొన్ని స్థలాలు ఆక్రమణ అయ్యాయి అని వచ్చిన వార్తలు, వాటిపై పంపిన నివేధికలు పరిశీలించి స్టేటస్ సమర్పించవలెను. కనకదుర్గా నగర్ నుండి షాపులు తరలింపు తదితర విషయాలు ఫాలోప్ చేయవలెను. సర్వీస్, నాన్ సర్వీస్ విషయాలు పై కోర్టుకేసులు పరిశీలించి పరిష్కారానికి మార్గం చూడవలెను.
దుర్గా ఘాట్లో అసలు ఎంతమందికి హాకర్ లైసెన్స్ ఇచ్చాము, అక్కడ ఎంతమంది వ్యాపారం జరుపుతున్నారు, ఎంత ప్రదేశం కేటాయించాము, అద్దె బకాయిలు ఎంత ఉన్నాయి అనే విషయాలపై నివేదిక ఇవ్వగలరు.
2) బి.వి.రెడ్డి, ఎ.ఇ.ఓ.
అన్నదానం, అకామిడేషన్, వేదపాఠశాల సెక్షన్స్
పాయింట్స్ : ముఖ్యమంత్రిగారి ఆదేశాల ప్రకారం భక్తుల ఫీడ్ బాక్ నిమిత్తం అన్నదానంవద్ద రోజుకు 1500కి పైగా భక్తుల ఫోన్ నెంబర్లు ఆన్లైన్ చేయవలెను.దీని నిమిత్తం అన్నదానం మొత్తం సిబ్బందిని బాధ్యులను చేయవలెను.
దేవస్థానం సత్రములు, అతిథి గృహములు పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోనికి రావడానికి తగు చర్యలు తీసుకోవలెను. సీతానగరం సీత బిల్డింగ్ స్వాధీనంకొరకు దేవదాయశాఖ కార్యాలయంలో ఫాలోప్ చేయవలెను.జమ్మిదొడ్డి నుంచి ఆడిట్ ఆఫీస్ మహామండపంకు మార్పు చేసి అన్ని గదులు భక్తులకు కేటాయించటానికి ఇంజనీరింగ్ వారితో సమన్వయం చేసుకోవాలి. వేదపాఠశాల సౌకర్యాలు మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవలెను.
3) ఎన్.రమేష్ బాబు ఎ.ఇ.ఓ.,
మెయిన్ టెంపుల్, ప్రోటోకాల్, ప్రొవిజన్స్, ఫెస్టివల్స్, పూజలు, స్టేషనరీ సెక్షన్స్
పాయింట్స్ : భక్తుల దర్శనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ప్రొటోకాల్ ఎవరికి వర్తిస్తుంది, ఎవరు రికమండ్ చేస్తున్నారు గమనించి వ్యవహరించవలెను.
వి.ఐ.పి.లు, సినీతారలతో ఫోటోలకోసం సిబ్బంది ఎగబడి ఆలయ సాంప్రదాయాలను విస్మరిస్తున్నారు.
ప్రముఖులకు ఆలయ ఈ.ఓ., ఎ.ఇ.ఓ వార్లు చిత్రపటం, ప్రసాదం ఇస్తున్నప్పుడు విధులతో సంబంధంలేని వ్యక్తులు ఫోటోలలో ఉంటున్నారు. తిరుమలలో ఏ విధమైన కట్టుబాటు ఉందో అదే విధంగా ఫాలో అవ్వాలి.
నిబంధనలను అతిక్రమణ చేసేవారిని హెచ్చరించాలి.
ప్రసాదాల తయారీ సరుకుల నాణ్యత ఎప్పటికప్పుడు పరిశీలించాలి, ల్యాబ్ టెస్ట్ తరువాతనే బిల్లులను చెల్లించాలి.
ఆర్జిత సేవలు, పూజలు, ఫెస్టివల్స్ నిర్వహణ పట్ల భక్తులలో సంతృప్తి స్థాయి పెంచాలి.
సంకష్టహర చతుర్ధశి, సరస్వతీ హోమం, సుబ్రహ్మణ్య కళ్యాణం, పౌర్ణమి నగరోత్సవం గురించి 3రోజులకు ముందే దేవస్థానం పి.ఆర్.ఓ.కు ఎ.ఇ.ఓ., స్థాయిలోనే నోట్ ఇవ్వవలెను.
ఆర్జిత సేవలు సమయానికి ప్రారంభం అవ్వటం, భక్తులతో నిధానంగా వ్యవహరించటం కీలకం. దేవస్థానం ఫెస్టివల్ క్యాలెండర్ 2రోజులలో రూపొందించి వైదిక కమిటీ ఆమోదంతో దేవస్థానం వెబ్ సైట్ లో అప్లోడ్ చేయవలెను. సోషల్ మీడియా ద్వారా ఫెస్టివల్స్ ప్రచారం చేయవలెను.
2026 వార్షిక క్యాలెండర్లు దసరాకి ముందే ముఖ్యమంత్రి తో ఆవిష్కరణచేసి దసరాకు, భవానీ దీక్షలకు భక్తులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవలెను.
4) డాక్టర్ కె.గంగాధర్, ఎ.ఇ.ఓ.ఇన్చార్జ్, ( పి.చంద్ర శేఖర్ ,ఎ.ఇ.ఓ. వారి సెలవు లో)
– అడ్మినిస్ట్రేషన్, కౌంటర్స్ సూపర్వైజేషన్, సెక్యూరిటీ & శానిటేషన్ సెక్షన్స్ :-
పాయింట్స్ : సర్వీస్ మ్యాటర్స్లో ఫైల్స్ పెండింగ్ లేకుండా చూడవలెను. స్పెషల్ గ్రీవెన్స్ లో వచ్చిన ధరఖాస్తులు పరిష్కారం చేయవలెను.
అన్ని టిక్కెట్ కౌంటర్లు, సేల్ కౌంటర్స్ ప్రతిరోజూ తనిఖీ చేయవలెను.
సెక్యూరిటీ, శానిటేషన్ పనితీరు మెరుగుపరచటానికి అన్ని చర్యలు తీసుకోవాలి.
ఆడిట్ అభ్యంతరాలుమీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించవలెను. అభ్యంతరాలు పరిష్కారానికి సెక్షన్ల వారీగా సమీక్ష నిర్వహించి, చర్యలు తీసుకోవలెను.
శారీస్ విభాగం నుండి ఆషాఢ, శ్రావణ మాసంలో రద్ధీకి తగ్గట్టుగా దేవస్థానమునకు చెందే చీరల విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను.
పరిపాలనా విభాగం తరవాత కీలకమైనది జనరల్ సెక్షన్ కాబట్టి...జనరల్ సెక్షన్ నుండి అన్నిరకాల సాధారణ, పరిపాలనా, భక్తుల సంబంధిత పిర్యాదులు తదితరముల మీద జనరల్ నోట్స్, ఆర్డర్స్ ఈ. ఓ. అనుమతితో జారీచేయవలెను.
5) శ్రీ ఎమ్.ఎస్.ఎల్.శ్రీనివాస్, ఎ.ఇ.ఓ.
– అకౌంట్స్, ప్రసాదం తయారి :-
పాయింట్స్ : అకౌంట్స్ సెక్షన్ నుండి ఆదాయ వ్యయములు, డిపాజిట్స్ తదితరములు పరిశీలించి తగు నివేదిక సమర్పించవలెను. బ్యాంక్ వడ్డీ రేట్లు గమనించవలెను.
ప్రసాదం తయారీలో అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించి, శ్యాంపిల్ కలెక్షన్ చేయవలెను.
6) శ్రీ ఎన్.తిరుమలేశ్వరరావు ఎ.ఇ.ఓ.
-కేశఖండన, దత్తత దేవాలయాలు, దుర్గాఘాట్, కనకదుర్గానగర్ :-
పాయింట్స్ : కేశఖండనలో భక్తుల నుండి అధిక వసూలుమీద పిర్యాదులు ఎక్కువగా ఉన్నవి, కమీషనర్ వారు, సెక్రెటరీ వార్ల స్థాయిలో పిర్యాదులు పెరిగి ఉన్నవి, రాకుండా చూడాలి.
దుర్గాఘాట్ పరిశుభ్రత, భక్తుల పుణ్య స్నానాలు, దుర్గాఘాట్లో హాకర్లు వారికి కేటాయించిన స్థలం దాటి ఆక్రమణ చేస్తున్నది అరికట్టవలెను.
భక్తుల నుండి హాకర్లు అధిక రుసుములు వసూలు చేయకుండా నిరోధించవలెను.
కనకదుర్గానగర్ నుండి మహా మండపం వరకు ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యాలు పరిశీలించి ఎప్పటికప్పుడు సరైన చర్యలు తీసుకోవలెను.
7) డాక్టర్ కె.గంగాధర్, ఎ.ఇ.ఓ.,
శ్రీకనకదుర్గప్రభ మాసపత్రిక, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ధర్మప్రచారం(ధర్మపథం), భక్తుల ఫీడ్ బ్యాక్ నమోదు.
పాయింట్స్ : దేవస్థానంలో మనం చేసే మంచి భక్తులకు చేరాలంటే పి.ఆర్.ఓ.వ్యవస్థ ముఖ్యమైనది. ఆ విధంగా ఇంకా మెరుగుగా పనిచేయాలి.
ఈ దేవస్థానంలో ప్రవేట్ షాపులు నిండుగా ఉండి రోజుకు లక్షలాది రూపాయలు వ్యాపారం జరుగుతుండగా, ఇంత పెద్ద దేవస్థానంలో పబ్లికేషన్ స్టాల్ ఒక్కచోటే ఉండటం గమనించటమైనది.
భక్తులకు అందుబాటులో పబ్లికేషన్ స్టాల్ ఏర్పాటుకు స్టేషనరీ విభాగంవారితో కలిసి చర్యలు తీసుకోవలెను.
రోజూవారీగా కౌంటర్ సేల్ నివేదిక ఇవ్వవలెను. ధరల పట్టిక లేదని, అధిక ధరలను వసూలు చేస్తున్నారని భక్తుల నుండి పిర్యాదులు వస్తున్నందున ధరల పట్టిక ఏర్పాటు, ప్రతీ వస్తువుకి రశీదు ఇచ్చే చర్యలు తీసుకోవలెను.
ఈ సందర్బంగా దేవస్థానంలో సెల్ ఫోన్ భద్రం చేసే కౌంటర్, క్లోక్ రూమ్, శానిటేషన్, సెక్యూరిటీ బాధ్యులు తో ఇదే సమావేశం లో మాట్లాడారు.
భక్తులు నుండి వస్తున్న పిర్యాదులు చూస్తే మీ పని తీరు తెలుస్తుందని అన్నారు. మొబైల్ ఫోన్స్ తో జనం ఆలయం లో తిరుగుతున్నారని, సెక్యూరిటీ ఈ విషయంలో ఫెయిల్యూర్ అవుతున్నారని, క్లోక్ రూమ్ లో అధిక వసూలు తగదని పేర్కొన్నారు.