Home Andhra Pradesh ప్ర‌జలంద‌రిపై ఆ భ‌గ‌వంతుడి ఆశీస్సులు వుండాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)చిట్టిన‌గ‌ర్ లో శ్రీ...

ప్ర‌జలంద‌రిపై ఆ భ‌గ‌వంతుడి ఆశీస్సులు వుండాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)చిట్టిన‌గ‌ర్ లో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజ‌రు

5
0

13-06-2025

ప్ర‌జలంద‌రిపై ఆ భ‌గ‌వంతుడి ఆశీస్సులు వుండాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)
చిట్టిన‌గ‌ర్ లో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజ‌రు
న‌గ‌ర‌ అభివృద్ధిలో న‌గరాలు ఒక భాగం

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ది తో పాటు రాష్ట్రాభివృద్ది జ‌రిగే విధంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ప్ర‌జ‌లంద‌రిపై వుండాలి. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు మ‌రుపిళ్ల చిట్టి కాలం నుంచి న‌గ‌రాలు అభివృద్ధిలో ఒక భాగం అయ్యార‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు.

చిట్టి న‌గ‌ర్ లో జ‌రుగుతున్న‌ నగరాల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం 14వ వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్ర‌వారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని ) ముఖ్యఅతిథి గా హాజ‌ర‌య్యారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో ఆలయ కమిటీ సభ్యులు పురోహితులు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో శ్రీ వెంకటేశ్వర స్వామిను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ న‌గ‌రాలు వారి సొంత నిధుల‌తో గుడి, క‌ళ్యాణ మండ‌పం ఏర్పాటు చేసుకోవ‌టం చాలా గొప్ప విష‌యమ‌న్నారు. అలాగే వివిధ స‌హాయ కార్య‌క్ర‌మాల ద్వారా పేద ప్ర‌జ‌ల‌ను ఆదుకునే విష‌యంలో న‌గ‌రాలు ఎప్పుడు ముందంటార‌ని కొనియాడారు. ఆల‌య అభివృద్ధి, ఆల‌య క‌మిటీకి అండ‌గా వుంటామ‌న్నారు.ఐదు రోజుల పాటు జ‌రిగే శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ప్ర‌జ‌లంద‌రూ పాల్గొని ఆభ‌గ‌వంతుడి ఆశీస్సులు పొందాల‌ని సూచించారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాల‌ని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ప్రార్థించిన‌ట్లు వెల్ల‌డించారు.

*ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిల్లా శీను, నగరాల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరుపిళ్ల తిరుమల్లేష్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్. ఎస్. బేగ్, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు, రాష్ట్ర వాణిజ్య విభాగ ఆర్గనైజింగ్ సెక్రెటరీ దనేకుల సుబ్బారావు, పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు ఆర్ మాధవ, పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, మైలవరపు కృష్ణ, ఆర్. శ్రీనివాసరావు (మాస్టారు ),టిడిపి సీనియర్ నాయకులు కోగంటి రామారావు, టిడిపి సీనియర్ మహిళా నాయకురాలు బంక నాగమణి, ఆలయ కమిటీ సభ్యులతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here