Home Andhra Pradesh ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర

ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర

4
0

Press Release

ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర

పార్టీ సంస్థాగత కమిటీలు త్వరగా పూర్తి చేయండి..పార్టీ కోసం పని చేసేవారికి చోటు కల్పించండి

జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణా శిభిరాలు

ఎమ్మెల్యేలు రోజూ పార్టీకి కొంత సమయం కేటాయించాలి

రేపు లక్ష చోట్ల నిర్వహించే యోగా డే సన్నాహక కార్యక్రమంలో పాల్గొనండి

తల్లికి వందనం నిధులు విడుదలతో సర్వత్రా సంతృప్తి

వచ్చే వారమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం

ఒకే నెలలో రెండు సూపర్ – 6 పథకాలు అమలు చేసి చూపిస్తున్నాం

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

• ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు వివరించాలి.

• ఈ కార్యక్రమంలో లీడర్ నుంచి కేడర్ వరకూ ప్రతి ఒక్కరూ విజయయాత్రలో పాల్గొనాలి. ప్రచారం చేసే విషయంలో పోటీ పడాలి.

• మొదటి ఏడాది ఏం చేశామో చెప్పడంతో పాటు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మనం ఏడాదిలో సాధించిన విజయాలు తట్టుకోలేకనే ప్రత్యుర్ధులు మహిళలను అవమానించడంతో పాటు దాడులకు దిగుతున్నారు.

• మహానాడు విజయవంతమైందని సేద తీరొద్దు. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలి. పార్టీ కోసం కష్టపడేవారికి అవకాశం కల్పించాలి. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని కమిటీల్లో స్థానం కల్పించాలి.

• కుటుంబ సాధికార సారధిలో ఉంటేనే ఎవరికైనా పదవులు వస్తాయి. కార్యకర్తలు ఎప్పుడూ డైనమిక్‌గా ఉండాలి.

• జూలై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణా శిభిరాలు నిర్వహిస్తాం.

• కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దుతాం. అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. ఎమ్మెల్యేలు కూడా ప్రతి రోజూ పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలి. ప్రజలతో నిత్యం కలుపుగోలు తనంతో మెలగాలి.

• రాష్ట్రంలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విశాఖపట్నంలో ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5 లక్షల మందితో నిర్వహిస్తున్నాం.

• అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 2.21 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు రోజులు పాల్గొంటే సర్టిఫికేట్ ఇస్తాం. యోగా జీవితంలో భాగం కావాలి. హెల్తీ, వెల్దీ, హ్యాపీ సమాజంగా మారడానికే దీనికి శ్రీకారం చుట్టాం.

• ఇది మనందరి కార్యక్రమం. ఏపీని ప్రపంచ పటంలో పెట్టేందుకు చేపట్టిన ఉద్యమం.
• రేపు లక్ష చోట్ల యోగా డే సన్నద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

• రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే యోగా లాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం.

• ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం అమలు చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది ఉన్నా పథకం వర్తింపజేస్తామని చెప్పి ఇచ్చాం.

• నిన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో నిర్వహించాల్సిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అహ్మదాబాద్‌లో విమానం కూలడంతో రద్దు చేశాం.

• కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ముందు సూపర్-6, మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తోంది.

• ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ముఖ్య పథకాలన్నీ ఏడాదిలోపే అమలు చేస్తున్నాం.

• విచ్చలవిడి అప్పులతో గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.

• 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10 వేల కోట్లు తల్లికి వందనం పథకాలు విడుదల చేశాం.

• తల్లుల అకౌంట్లో రూ.13 వేలు, పాఠశాలల అభివృద్ధికి రూ.2 వేలు కేటాయిస్తున్నాం.
• పాఠశాలలు తెరిచేలోపే పథకం అమలు చేస్తామని చెప్పి చేశాం.

• ఒక బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మంది, ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322 మంది, ముగ్గరు బిడ్డలు ఉన్న తల్లులు 2,10,684 మంది, నలుగురు బిడ్డలు ఉన్న తల్లుల 20,053 మంది ఉన్నారు.

• గత ప్రభుత్వం 42 లక్షల మందికే పథకాన్ని అమలు చేసింది. ఆ ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం 25 లక్షల మందికి అదనంగా ఇస్తోంది.

• వారు చేసిన ఖర్చు రూ.5,540 కోట్లు, మన ప్రభుత్వం చేసే ఖర్చు రూ.8,747 కోట్లు. వాళ్ల కంటే ఏడాదికి రూ.3,205 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం.

• తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని వేల కోట్లు ఒక పథకానికిక ఒకేసారి విడుదల చేయడం ఒక చరిత్ర.

• నలుగురు పిల్లులు ఉంటే రూ.13 వేల చొప్పున రూ.52 వేలు వారి అకౌంట్లోకి వెళ్తున్నాయి.

• అయినా బుద్ధి, జ్ఞానం లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నిబంధనలు కూడా మార్చకుండా మెరుగ్గా ఇస్తున్నాం.

• ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను కూటమి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మనం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

• ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఏడాదికి రూ.34 వేల కోట్లు ఇస్తున్నాం. అన్నాక్యాంటీన్ల ద్వారా 4 కోట్ల భోజనాలు సరఫరా చేశాం.

• రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ కింద ఈనెల 20వ తేదీన పథకాన్ని ప్రారంభిస్తున్నాం.’ అని సీఎం అన్నారు.

• ఏడాది పాలన పూర్తైన సందర్భంగా టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబుకు నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here