ఇరువురికి వైద్యచికిత్స నిమిత్తం సి.ఎమ్. ఆర్.ఎఫ్ ఎల్.వో.సి లు అందచేసిన యార్లగడ్డ గన్నవరం : ఇరువురు రోగులకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి లను ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు రోగులకు అందజేశారు. గన్నవరం మండలం బుద్దవరం గ్రామస్తులు భువనేశ్వరి పలగాని రూ. 3. 50 లక్షలు, కొండపావులూరు గ్రామానికి చెందిన కూచిపూడి కోటేశ్వరమ్మ కు రూ.2 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఎల్ వో సి లను శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యార్లగడ్డ అందజేశారు. వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సాయం లభించేలా కృషిచేసిన యార్లగడ్డకు రోగుల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. పెద్ద రోగులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువమందికి సహాయం అందించినట్లు ఈ సందర్భంగా యార్లగడ్డ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని పేద రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.