విద్యా వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి
ఏపీ లో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ పాఠశాల విద్యను గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి అన్నారు.
విద్యాధరపురం, లేబర్ కాలనీ లోనీ జీ.ఎన్.ఆర్.ఎం హై స్కూల్ లో పాఠ్య, రాత పుస్తకాలను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్ ,పాఠశాల
ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు
ఎస్ వీ ఎన్ గణేష్ తో కలిసి శుక్రవారం విద్యార్థులకు
పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ రత్నకుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం నుంచే ఉచిత పాఠ్య ,రాత పుస్తకాలు, యూనిఫాం దుస్తులు అందజేస్తూ విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.
అదేవిధంగా సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం సౌకర్యం కూడా విద్యార్థులకు కల్పిస్తుందని ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు లక్ష్యంతో చదవాలన్నారు.
టీడీపీ సీనియర్ నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ పశ్చిమ లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కట్టుబడి ఉన్నారని తెలిపారు . విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతతో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి అందిస్తున్న సహకారం వెలకట్టలేనిదన్నారు .
సుజనా ఫౌండేషన్ ద్వారా జి.ఎన్.ఆర్.ఎం పాఠశాలలో
రూ 15 లక్షలతో ఐ.ఓ.టి లాబ్ ను మరియు గ్రంథాలయాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా పశ్చిమ లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని మైలవరపు దుర్గారావు తెలిపారు.
ఇన్చార్జ్ హెడ్మాస్టర్ ఎస్ వీ ఎన్ గణేష్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. పిల్లలందరూ పాఠశాలకు వచ్చి బాగా చదువుకోవాలని కోరారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే లక్ష్మీనారాయణ, సుజనా మిత్రా కోఆర్డినేటర్ పుప్పాల భవాని అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు