12.06.2025
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత …
-జాయింట్ కలెక్టర్
ఎస్. ఇలక్కియ
బాల కార్మికులను రక్షించటం, సంరక్షించటం ,బాలల హక్కుల పరిరక్షణ సమాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు.
ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం సందర్భంగా గురువారం కార్మిక శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్,
సంయుక్త ఫౌండేషన్,
మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు
ప్రాఫిట్ షూ కంపెనీ సంయుక్త సహకారంతో సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ మరియు ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని బాల కార్మికులు లేని సమాజాన్ని అందరు కలిసి నిర్మించాలని అన్నారు. బాలల హక్కులు, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని
ఆపదలో ఉన్న బాలలను రక్షించడంలో ప్రతి ఒక్కరు స్పందించాలని తెలిపారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని,
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మా సంస్థలో బాల కార్మికులు లేరు అనే ప్రత్యేకమైన స్టిక్కర్లను జాయిన్ కలెక్టర్ ఆవిష్కరించడం జరిగింది.
కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్
CH.ఆశా రాణి మాట్లాడుతూ బడి బయట ఉన్న బాలలను గుర్తించటం,
వీధి బాలలుగా, బాల కార్మికులుగా ఉన్న బాలలను రక్షించడంలో సమాజం కీలక పాత్ర పోషించాలని అన్నారు.
కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన ఫోరం ఫర్ చైల్డ్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ
వీధి బాలలు లేని,
బాల కార్మికులు లేని,
బాల్యవివాహాలు లేని,
బాలలపై హింస లేని సమాజాన్ని
అందరి సహకారంతో నిర్మించవచ్చని ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, దీన్ని సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.
బాలలపై లైంగిక వేధింపులు శారీరక వేధింపులు ఉండకూడదని
బాలలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త వహిస్తూ అత్యవసర సమయాలలో ఉచిత
చైల్డ్ హెల్ప్ లైన్ 1098 గాని
పోలీస్ 100/112 కి తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో
కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్
G. ధనలక్ష్మి
కార్మిక శాఖ అధికారులు
ALOs టి రాజేష్,
డి రత్నకుమారి,
పి.రామ్ కుమార్,
జి విజయ సారథి
డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ డిస్టిక్ చైన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజేశ్వరరావు,
సోషల్ వర్కర్లు శారద, లత,
బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రెటరీ కోటే.ప్రకాష్ కుమార్, నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తంబి జోసెఫ్,
అడ్మినిస్ట్రేషన్ ఫాదర్ మర్రెడ్డి,
ప్రోగ్రాం మేనేజర్ జి శేఖర్ బాబు, కోఆర్డినేటర్ కె.ప్రియాంక,
కృపా ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర,
వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ కోఆర్డినేటర్ సిహెచ్ ప్రభాకర్, వాసవ్య మహిళా మండలి కోఆర్డినేటర్ జై హృదయ రాజు, సిబ్బంది బాలురు పాల్గొన్నారు.