12-6-2025
ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలనను కొనసాగిస్తోంది – MLA బొండా ఉమ
లబ్ధి పొందినటువంటి స్పౌజ్ కేటగిరీ పింఛన్ల లబ్ధిదారులతో నియోజకవర్గ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజానికంతో – అభివృద్ధి సంక్షేమంలో బాగాస్వామ్యం అయ్యేటువంటి ప్రముఖులతో – MLA బొండా ఉమ
ధి:12-6-2025 గురువారం ఉదయం 9:30 “గం లకు ” రాష్ట్రంలో NDA ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ గుజ్జల సరళ దేవి కళ్యాణ మండపం నందు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన ఏడాది పాలనపై ఘనంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవ వేడుకలు నిర్వహించి ముందుగా అన్న నందమూరి తారకరామారావు విగ్రహానికి, స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టడం జరిగినది.
ఈ సందర్భంగా బొండా ఉమా ముందుగా మాట్లాడుతూ సరిగ్గా సంవత్సరం క్రితం ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించి ఇదే రోజున శాసనసభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు ప్రమాణం స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ, కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు NDA కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా మహిళా మణులకు కానుకగా ఈరోజు నుంచి తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలోని 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది అని
1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ 1st year చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం ఇవ్వనున్నాము అని, సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన NDA కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది అని
2024 జూన్ నెలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి గత సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ₹200 కోట్ల రూపాయలకు పైగా చేసిన వివిధ అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3,000/- లుగా ఉన్న వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ పింఛన్లు 4,000/- కు పెంచమని, రూ.4,000/- లుగా ఉన్న వికలాంగుల పింఛను రూ.6,000/- లకు పెంచి ఒకటో తారీకు ఆదివారం వస్తే ముందు రోజు 6:00 గంటలకల్లా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిది అని.
సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు నిరుపేద లబ్ధిదారులకు ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడంతోపాటు ఇవ్వనటువంటి హామీని కూడా నెరవేరుస్తూ ముందుగానే వారి ఖాతాలోనే నగదు జమ చేస్తున్నామని, అన్న క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు ₹5 రూపాయలకే ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం పెట్టి పేదవాడి కడుపు నింపుతున్నామని…
ఇటువంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో మన రాష్ట్రం, సెంట్రల్ నియోజకవర్గం ముందుకు దూసుకెళ్తుంది అని, రానున్న నాలుగేళ్లలో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేసి చూపుతామని…
కూటమి ప్రభుత్వ సుపరిపాలన ఏడాది గడుస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో ‘స్పౌజ్ కేటగిరీ పింఛన్లు’ పేరిట పింఛను పొందుతున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు స్పౌజ్ కేటగిరీ కింద మరుసటి నెల నుంచే పింఛన్ ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 15 వరకు ఈ రకమైన వాళ్ళు సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్ కు చెందిన 260 మంది కి ₹10 లక్షల 40 వేల రూపాయల మంజూరైన సర్టిఫికెట్లు అందజేసారు…
ఈ కార్యక్రమంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్లు వల్లభనేని రాజేశ్వరి, కంచి దుర్గ, మోదుగుల తిరుపతమ్మ, మాజీ కార్పొరేటర్లు ఎరుబోతు రమణారావు, పైడి తులసి, పిరియ జగదాంబ, ఎరుబోతు శ్రావణి, విజయ్ కృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సురవరపు నాగరాజు, పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సింగం వెంకన్న, BJPN రాజు, Sk జాన్ వలి, బంగారు నాయుడు, Sk ఫర్వీన్, వేల్పుల రాజేష్, దాసరి ఉదయశ్రీ, దివి ఉమామహేశ్వరరావు, ఇప్పిలి మోహన్, కాకొల్లు రవికుమార్, లబ్బా వైకుంఠం, పైడి శ్రీను, బెజ్జం జైపాల్, Sk బాషా, పిరియ సోమేశ్వర రావు, తోపాటు అధికారులు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.