తాగునీటి సమస్యను పరిష్కరించారుహెచ్ బీ కాలనీ లోనీ 350 ,450 ఎస్.ఎఫ్. టి బ్లాకుల వద్ద గత 15 రోజులుగా తలెత్తిన తాగునీటి సమస్యను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పరిష్కరించారు . కాలనీలోని తాగునీటి సంప్ వద్దవిద్యుత్ మోటార్ లో తలెత్తిన సమస్యల వలన ప్రెజర్ అందక ప్రధాన పైపుకు నీటి ప్రవాహం తగ్గటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గత రెండు రోజులుగా ప్రత్యేక దృష్టి సారించి సంప్ ను రిపేరు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించారు. సంపులో ప్రధాన పైపులకు మరమ్మతులు చేసిన తర్వాత తాగునీటి సరఫరా పునరుద్ధరించబడింది. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్యఎన్డీఏ కూటమి నేతలతో కలిసి నూతన మోటార్ ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. తాగునీటి సరఫరా పునరుద్ధరించబడటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కార్యక్రమంలో సుజనా మిత్ర కోఆర్డినేటర్ ఫణీంద్ర,ఎన్డీఏ కూటమి నేతలు సీత చంద్రశేఖర్, పచ్చవ మల్లికార్జున, బ్రహ్మారెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ భాను తదితరులు పాల్గొన్నారు
Home Andhra Pradesh తాగునీటి సమస్యను పరిష్కరించారుహెచ్ బీ కాలనీ లోనీ 350 ,450 ఎస్.ఎఫ్. టి బ్లాకుల వద్ద...