Home Andhra Pradesh నిత్య యోగాతో న‌వ జీవిత యోగం ప్ర‌తి ఒక్క‌రికీ యోగాను చేరువ‌చేసేందుకు థీమ్‌యోగా జిల్లా క‌లెక్ట‌ర్...

నిత్య యోగాతో న‌వ జీవిత యోగం ప్ర‌తి ఒక్క‌రికీ యోగాను చేరువ‌చేసేందుకు థీమ్‌యోగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

3
0

*ఎన్‌టీఆర్ జిల్లా, జూన్ 10, 2025 నిత్య యోగాతో న‌వ జీవిత యోగం ప్ర‌తి ఒక్క‌రికీ యోగాను చేరువ‌చేసేందుకు థీమ్‌యోగా జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*నిత్య యోగాతో జీవితంలో నూత‌న ఉత్తేజం వెల్లివిరుస్తుంద‌ని, స‌మాజంలో ప్ర‌తిఒక్కరికీ యోగాను చేరువ‌చేసేందుకు థీమ్ యోగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. మంగ‌ళ‌వారం బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో జిల్లా అధికార యంత్రాంగం, ఆయుష్ శాఖ‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన థీమ్ యోగా కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ హాజ‌ర‌య్యారు. ఉపాధి హామీ శ్రామికుల‌తో పాటు విశ్రాంత పోలీసు అధికారులతో క‌లిసి యోగాస‌నాలు వేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌తి వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు యోగాపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు థీమ్ యోగా నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఉపాధి హామీ ప‌థ‌కం శ్రామికుల‌తో పాటు విశ్రాంత పోలీసు అధికారుల‌తో క‌లిసి యోగాస‌నాల అభ్య‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.కార్య‌క్ర‌మంలో డ్వామా పీడీ ఎ.రాము, ఆసోసియేష‌న్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్స్ అధ్య‌క్షులు ఏఎస్ఎన్ రెడ్డి కార్య‌ద‌ర్శి డా. పి.హ‌రికృష్ణ‌, కోశాధికారి డి.రాజారావు, ల‌య‌న్స్ క్ల‌బ్, సిద్దార్థ క‌ళాశాల యోగా శిక్ష‌ణ కేంద్రం స‌భ్యులు, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, ఆయుష్ అధికారి డా. రామ‌త్లేహి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here