Home Andhra Pradesh ఎన్టీఆర్ జిల్లా వైసిపి ఆధ్వర్యంలో రామవరప్పాడు కె హోటల్ నందు విలేకరుల సమావేశం మాజీ మంత్రి...

ఎన్టీఆర్ జిల్లా వైసిపి ఆధ్వర్యంలో రామవరప్పాడు కె హోటల్ నందు విలేకరుల సమావేశం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్ కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనలో

5
0

విజయవాడ10-06-2025*ఎన్టీఆర్ జిల్లా వైసిపి ఆధ్వర్యంలో రామవరప్పాడు కె హోటల్ నందు విలేకరుల సమావేశం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్ కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనలో ఇచ్చిన హామిలు ఏది అమలు చేయలేదు గతంలో పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వం వచ్చాక మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా చేస్తామన్నారు కూటమి పాలనలో మహిళల పై ప్రతి రోజు మహిళల అత్యాచారాలు, అఘాయాత్యాలు, హత్యలు, జరుగుతున్నా మహిళలు మిస్సింగ్ అవుతున్న వాటి పై చర్యలు లేవు, వాటిని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది 70 ఏళ్ల వయసున్న కొమినేని శ్రీనివాస్ ని అక్రమ అరెస్ట్ చేసారు ఇంట్లో టాబ్లెట్, బట్టలు తీసుకుందామన్న నిర్దాక్షణంగా గేట్ బయటే ఆపేసి క్రిమినల్ ముద్దాయిలాగ ట్రీట్ చేసి, ప్రొసిడ్యూర్ పాటించకుండా పోలీస్ వ్యవస్థ వ్యవహరిచింది సాక్షి మీడియ భయపడుతుందని, వైయస్ ఆర్ సిపి శ్రేణులు బయపడుతున్నారని కూటమి నేతలు అనుకుంటున్నారు, ఎవ్వరు భయపడే పరిస్థితిలో లేరు ప్రజలకోసం ఎంతవరకైనా నిలబడే పార్టీ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుక వినిపించడం కోసం ఎంత దూరమైన వెళ్లే మీడియా సాక్షి మీడియా ఎన్ని అరాచకాలు చేసిన, ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజల పక్షాన నిలబడతాం ప్రజలు కూటమి ప్రభుత్వానికి పరిపాలన ఇచ్చింది దాడులు చేయడానికా ?, మానభంగాలు, హత్యాచారాలు చేస్తున్న పట్టించుకోకుండా ఉండడానికా ? కక్షసాధింపు చర్యలకు, ప్రశ్నించే ప్రతి గొంతును అణగతొక్కడానికి అక్రమ అరెస్టులు చేయడానికి తప్ప, కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడంలో విఫలమైంది**సాక్షి మీడియా పైన దాడులు చేసింది కూటమి నేతలే ముఖ్యంగా తెలుగు దేశం పార్టీల నేతలే ఉన్నారు ప్రజలెవరు లేరు**దాడులు చూస్తూ కూర్చోము, తప్పకుండ వాటన్నిటికి సమాధానం చెప్పే రోజులు దెగ్గరలోనే ఉన్నాయి నూటికి నూరు పాళ్లు అట్టు పెట్టినమ్మకు రానున్న ప్రభుత్వంలో అట్టున్నారా పెడతాము దానికి కూటమి నేతలు సిద్ధంగా ఉండాలి**కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే వైయస్ ఆర్ సిపి పార్టీ మిమ్మల్ని ఒత్తిడి చేస్తూనే ఉంటుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజా కోర్టులో అందరిని దోషులుగా నిలపెడతాం.**కొమ్మినేని శ్రీనివాస్ ని కావచ్చు, ధనుంజయ రెడ్డి ని కావచ్చు, ఓఎస్డీ ని కావచ్చు అందరిని అరెస్ట్ చేశామని సంబరాలు పడద్దు, తప్పకుండా మళ్లి ఇవ్వని రిపీట్ అవుతాయి ఇటువంటి దుష్ట కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఆపాలి*రామవారప్పుడు రింగ్ వద్ద గల కె హోటల్ నందు మంగళవారం నాడు ఎన్టీఆర్ జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ వైసిపి ఇంచార్జ్ మల్లాది విష్ణు, నందిగామ వైసిపి ఇంచార్జ్ మొండితోక జగన్ మోహనరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తిరువూరు వైసిపి ఇంచార్జ్ నల్లగట్ల స్వామి దాస్, జగ్గయ్యపేట వైసిపి ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనలో ఇచ్చిన హామిలు ఏది అమలు చేయలేదని, ప్రజలకు పలాన మంచి చేశామని చెప్పుకోవడానికి ఏమి లేదన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వం వచ్చాక మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా చేస్తామన్నారని, కానీ కూటమి ప్రభుత్వ సంవత్సర పాలనలో మహిళల పై ప్రతి రోజు అత్యాచారాలు, అఘాయాత్యాలు, హత్యలు, జరుగుతున్నా మహిళలు మిస్సింగ్ అవుతున్న కూటమి ప్రభుత్వం, హోమ్ మంత్రి వాటి పై చర్యలు తీసుకోవడంలో, వాటిని నియంత్రించడంలో విఫలమైందన్నారు. అనేక మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, హత్యలకు గురవుతున్నారని, మిస్సింగ్ అవుతున్నారని వాటి పైన హోమ్ మంత్రి స్పందించలేదన్నారు. వైయస్ విజయమ్మ గురించి, భారతి గురించి మహిళా హోమ్ మంత్రి మాట్లాడితే వాటి పైన చర్యలుండవని, మాట్లాడని వాటికీ 70 ఏళ్ల వయసున్న కొమినేని శ్రీనివాస్ ని అక్రమ అరెస్ట్ చేసి కనీసం ఇంట్లో టాబ్లెట్, బట్టలు తీసుకుందామన్న నిర్దాక్షణంగా గేట్ బయటే ఆపేసి క్రిమినల్ ముద్దాయిలాగ ట్రీట్ చేసి ప్రొసిడ్యూర్ పాటించకుండా పోలీస్ వ్యవస్థ వ్యవహరించిందన్నారు. సాక్షి మీడియ భయపడుతుందని, వైయస్ ఆర్ సిపి శ్రేణులు బయపడుతుందని కూటమి నేతలు అనుకుంటున్నారని ఎవ్వరు భయపడే పరిస్థితిలో లేరని, ప్రజలకోసం ఎంతవరకైనా నిలబడే పార్టీ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజల గొంతుక వినిపించడం కోసం ఎంత దూరమైన వెళ్లే మీడియా సాక్షి మీడియా అన్ని అన్నారు. ఎన్ని అరాచకాలు చేసిన, ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ప్రజలు మీకు పరిపాలన ఇచ్చింది దాడులు చేయడానికా, మానభంగాలు, హత్యాచారాలు చేస్తున్న పట్టించుకోకుండా ఉండడానికా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కేవలం కక్షసాధింపు చర్యలకు, ప్రశ్నించే ప్రతి గొంతును అణగతొక్కడానికి అరెస్టులు చేయడానికి తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడంలో విఫలమైందన్నారు. తప్పుడు కేసులు బనాయించడం ఆపాలని, నిన్న సాక్షి మీడియా పైన దాడులు చేసింది కూటమి నేతలని ముఖ్యంగా తెలుగు దేశం పార్టీల నేతలే అని ప్రజలెవరు లేరని అన్నారు. దాడులు చూస్తూ కూర్చోమని తప్పకుండ వాటన్నిటికి సమాధానం చెప్పే రోజులు దెగ్గరలోనే ఉన్నాయని నూటికి నూరు పాళ్లు అట్టు పెట్టినమ్మకు రానున్న ప్రభుత్వంలో అట్టున్నార పెడతామని దానికి కూటమి నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి రోజు భయబ్రాంతులకు గురిచేసి తప్పుడు కేసులు బనాయించి ఎన్నేళ్లు మీరు పరిపాలిస్తారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరిచ్చిన హామీలు అమలు చేయకపోతే వైయస్ ఆర్ సిపి పార్టీ మిమ్మల్ని ఒత్తిడి చేస్తూనే ఉంటదని. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజా కోర్టులో అందరిని దోషులుగా నిలపెడతామని హెచ్చరించారు. కొమ్మినేని శ్రీనివాస్ ని కావచ్చు, ధనుంజయ రెడ్డి ని కావచ్చు, ఓఎస్డీ ని కావచ్చు అందరిని అరెస్ట్ చేశామని సంబరాలు పడుతున్నారేమో గాని తప్పకుండా మళ్లి ఇవ్వని రిపీట్ అవుతాయన్నారు. కూటమి నేతలందారు చేసిన తప్పులను ప్రజా కోర్టులో పెట్టి దోషులుగా అందరిని నిరూపిస్తామని తెలియజేశారు ఇటువంటి దుష్ట కార్యక్రమాలను ఆపాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here