ఏడాది పాలనపై 12వ తేదీన నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు
అదే రోజు సాయంత్రం ఎన్డీయే పక్షాలు, అధికార యంత్రాంగంతో వచ్చే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై అమరావతిలో సమీక్షా సమావేశం
ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించాం…అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి
ప్రభుత్వ పనితీరు, పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నా….ప్రతి సమాచారాన్ని తెప్పించుకుంటున్నా
బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహం….పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటాను
ప్రపంచ యోగా డే నిర్వహణలో పార్టీ శ్రేణులు భాగస్వాములు కావాలి…గ్రాండ్ సక్సెస్ చేయాలి
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిల్లోని పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు:-
• ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో చాలామార్పు తీసుకొచ్చాం.
• గత ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ, చీకటి అలుముకుంది. భయంకర పరిస్థితులను రాష్ట్ర ప్రజలు చూశారు.
• 1995, 2014లో కూడా ఇన్ని ఇబ్బందులు చూళ్లేదు. రాష్ట్రం పేరు వింటేనే దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని అసమర్థ పాలనతో పాతాళానికి తొక్కేశారు
• అయినా సమస్యలు చూసి పారిపోలేదు. మనం తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు వస్తున్నాయి.
• ప్రజలకు మనం చేసే మంచి చెప్పాలి….గత ప్రభుత్వ అరాచకాలను గుర్తు చేయాలి.
• ప్రభుత్వ పనితీరు, పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై సర్వేలు చేయిస్తున్నా….ప్రతి సమాచారాన్ని తెప్పించుకుంటున్నా.
• మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలి…ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి
• ఎమ్మెల్యేగా గెలిచాం కదా అని ఎవరైనా ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోతే వారికే ఎక్కువ నష్టం జరగుతుంది.
• మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదు అనేది నా ఆలోచన. అధికారంలో ఉన్న మనల్ని ప్రజలు అన్ని రకాలుగా గమనిస్తుంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
• గత ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా మనకు ఓట్లువేసి గెలిపించారు. అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి.
• శాశ్వతంగా ప్రజలు మనతో ఉండేలా చూసుకోవాలి. ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలిగించాలి.
• ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేసి నివేదికలు తెప్పించుకుంటున్నాను.
• మంచి చేస్తే అభినందిస్తా…ప్రోత్సహిస్తా….అవకాశాలు కల్పిస్తా….తప్పు చేస్తే మాత్రం దూరం పెడతా! రాజీ లేదు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి.
• ఏ ఒక్క వ్యక్తి చర్యల వల్ల వ్యవస్థకు నష్టం జరుగుతుంది అంటే అంగీకరించేది లేదు. 1995లో రాజకీయంగా నేను అనుసరించిన విధానం మంచి ఫలితాలను ఇచ్చింది
• మొదటి సారి ఎమ్మెల్యేలుగా అయిన వాళ్లు ఇవి తెలుసుకోవాలి. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలి…విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉండాలి.
• మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపిలు తమ పనితీరుతో ప్రజలకు దగ్గర అయ్యారు. వీరి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది.
• అయితే ఒకరిద్దరు వల్ల అక్కడక్కడా నష్టం కూడా జరుగుతోంది. ఒకరి కోసం పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటే మాత్రం అలాంటి నేతలను దూరంగా పెడతాను.
• కొన్ని సందర్భాల్లో అడ్మినిష్ట్రేషన్ లో తప్పుల వల్ల, అధికారుల తీరు వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. మంత్రులు ఈ విషయంలో మరింత బాధ్యతగా ఉండాలి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
• త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు. పనితీరును ఎప్పటికిప్పుడు సమీక్షించుకోవాలి…మంచిచెడులు తెలుసుకుని బాధ్యతగా పనిచేయాలి.
• ఏడాది పాలన పూర్తైన సందర్భంగా 12వ తేదీన రాష్ట్రంలో ఎన్డిఎ తరుపున 175 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలి.
• ఎన్డీయే ఎంపీలు, ఎమ్మెల్యేలతో అమరావతిలో సాయంత్రం 5 గంటలకు సమీక్షా సమావేశ ఏర్పాటు చేస్తున్నాం.
• మనం చేసిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.
• గత పాలకులు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని సర్వశక్తులు ఒడ్డి ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ ఫలితాలు అడ్డుకోవడానికి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. అయినా రాష్ట్ర పునర్ నిర్మాణ యజ్ఞం ఆగదు.
• ఈ నెల 12 లేదా 14వ తేదీలోపే తల్లికి వందనం నగదు తల్లులకు అందిస్తాం.
• అన్నదాత పథకం కూడా ఈ నెలలోనే ఇస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తాం.
• వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించింది. అలా అని ఎప్పుడూ వాళ్లవైపు చూడకూడదు. మనం నిలదొక్కుకోవాలంటే ఇంకా కష్టపడాలి.
• రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనా అనుమతులు ఇచ్చాం. తద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
• 2027కి పోలవరం పూర్తి అవుతుంది. అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరగుతోంది.
• కేంద్రం విశాఖ స్టేల్ ప్లాంట్కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతోంది.
• నేను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రమంత్రులతో సమావేశమై పరిస్థితులు, ఉన్న అవకాశాలు వివరిస్తున్నాను.
• మనకు పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అందుకే చేయూతనివ్వండని కోరుతున్నాను.
• పోలవరం – బనకచర్ల అనుసంధానంతో అద్భుత ఫలితాలు వస్తాయి. దీని వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నష్టం కలగదు.
• గోదావరిలో వృథాగా కలిసే 3 వేల టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు మాత్రమే మనం వినియోగించుకుంటాం. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా నాకు అందరూ ముఖ్యమే.
• తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టునూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించలేదు. కొందరు సెంటిమెంట్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
• ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవవాన్ని నిర్వహిస్తున్నాం. ఒకేచోట 5 లక్షల మందితో యోగా డే నిర్వహిస్తున్నాం.
• అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష చోట్ల యోగా నిర్వహిస్తాం. యోగా అందరి జీవితంలో భాగస్వామ్యం కావాలి. ఇది మన సంపద, వారసత్వం.
• పార్టీ కార్యకర్తలందరూ యోగా దినోత్సవంలో పాల్గొనాలి. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు…ఆరోగ్య రక్షణకోసం చేసేది.