విజయవాడలో రేషన్ షాపులను తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల
మూడు రోజుల్లో 42.14 శాతం మందికి రేషన్ సరఫరా
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ అందజేత
రేపు దీపావళి సంక్రాంతి కలిసినట్టు పండగ చేసుకుందాం.
పౌర సరఫరా శాఖామంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ-3-6-2025-
ఖచ్చితమైన తూకంతో రేషన్ సరుకులు అందిస్తామని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు..
విజయవాడ విద్యాధరపురం సర్కిల్ లో షాప్ నెంబర్ 10, మరియు 15 చౌక దుకాణాలను మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ సౌరబ్ గౌర్ తో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు…
తొలుత విజయవాడ విద్యాధరపురంలో వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన మంత్రి స్వయంగా రేషన్ సరుకులు అందజేశారు. కొద్దిసేపు వృద్ధ దంపతులతో మాట్లాడారు.. కొత్త రేషన్ విధానం అమలుపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డీలర్లు ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు..
అనంతరం విద్యాధరపురం చెరువు సెంటర్ నందున రెండు షాపులను మంత్రి తనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు. ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు.డీలర్ల అందిస్తున్న మెటీరియల్ నిల్వలు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇంటింటికీ సేవ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అన్నారు. ఎనీ టైం రేషన్ అదేవిధంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15 తేదీల్లోపు ఉదయం సాయంత్రం వేళల్లో రేషన్ షాప్ నుంచి లబ్ధిదారులు వారి అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు తీసుకున్న సౌకర్యం కల్పించామన్నారు.
జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటికి మూడు రోజుల్లో 62 లక్షల 14 వేల కార్డుదారుల కుటుంబాలకు రేషన్ సరుకులను అందించమన్నారు. అంటే దాదాపు 42.14 శాతం మందికి మూడు రోజుల్లో సరుకులు అందజేసినట్టు తెలిపారు.
అదేవిధంగా 65 సంవత్సరముల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపు వారి ఇంటి వద్దకే సరుకులు అందజేస్తామని మాటిచ్చామని అన్నారు… అందులో భాగంగా మూడు రోజుల్లో ఆరు లక్షల మందికి వారి ఇంటి వద్దనే సరుకులు అందజేసినట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీ లోపు మిగిలిన వృద్ధులు దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి సరుకులు అందజేస్తామని వివరించారు.
రేషన్ షాప్లలో వినియోగదారుల కోసం సౌకర్యవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఉన్న పాత విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాం అని గుర్తు చేశారు. రేషన్ సరఫరాలో పొరపాట్లకు తావులేకుండా సేవా భావంతో పని చేయాలని డీలర్లకు సూచించారు.
కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, పొరపాట్లు లేకుండా రేషన్ పంపిణీ చేస్తుందన్నారు. ప్రజలు వారికి అనుకూలమైన సమయానికి, అనుగుణంగా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.
వైసీపీ ఐదేళ్లు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
సంక్షేమం పేరుతో అవినీతి చేశారు కనుకే ప్రజలు తిరస్కరించారన్నారు.
రేపు దీపావళి సంక్రాంతి కలిసినట్టు పండగ చేసుకుందాం.
ఇక, “రేపు దీపావళి – సంక్రాంతి కలిసినట్టు పండగ చేసుకుందాం. గతేడాది జూన్ 4న రాక్షస పాలనకు ముగింపు పలికిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకోవాలి. ప్రతి ఇంటి వద్ద రంగులతో ముగ్గులు వేసి ఆనందంగా జరుపుకోవాలి” అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి పండుగ జరిపారు.