03-06-2025 కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తాము : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) రాయనపాడు లో మరిన్నీ రైళ్లు ఆగేవిధంగా కృషి చేస్తామన్న ఎంపీ కేశినేని శివనాథ్ఎమ్మెల్యే వసంత తో కలిసి పలు ప్రాంతాల్లో రైల్వే సమస్యలు పరిశీలన కొండపల్లి, రాయనపాడు రైల్వేస్టేషన్లను పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని , ఎమ్మెల్యే కృష్ణప్రసాద్*గొల్లపూడి,కొండపల్లి : అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మైలవరం నియోజకవర్గంలోని రాయనపాడు రైల్వేస్టేషన్ అభివృద్ధి కావటంలో మైలవరం ప్రజల చిరకాల స్వప్నం సాకారం అయింది. ఇదే విధంగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కొండపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి, రాయనపాడు రైల్వేస్టేషన్లను, ఆయా స్టేషన్లో పరిధిలోని సమస్యలను మంగళవారం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ పరిశీలించారు. కొండపల్లి రైల్వే స్టేషన్ మొత్తం పరిశీలించిన ఎంపి కేశినేని శివనాథ్ స్టేషన్ మాస్టర్ తోపాటు, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ రైల్వే స్టేషన్ లో రద్దీ తగ్గించి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేలా రైల్వేశాఖ రాయనపాడు స్టేషన్ శాటిలైట్ స్టేషన్ గా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మోడల్ గా తీర్చిదిద్దిందన్నారు.రాయనపాడు రైల్వే స్టేషన్లో మూడు, నాలుగు నెంబర్ ప్లాట్ ఫామ్స్ కూడా రెడీ కాబోతున్నాయన్నారు. రాయనపాడు రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభం కాబోతుందని, ఇక్కడ మరిన్ని రైళ్లు ఆగేవిధంగా చూస్తామన్నారు.ఇక్కడినుంచి ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. అనంతరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ . ఎంతో ప్రఖ్యాత చరిత్ర కలిగిన కొండపల్లి రైల్వేస్టేషన్ ను ఎంపి కేశినేని శివనాథ్ సహకారంతో అభివృద్ది చేస్తామన్నారు. అభివృద్ధికి దూరంగా వున్న కొండపల్లి రైల్వేస్టేషన్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు.ఇక రాయనపాడు రైల్వే స్టేషన్ లో ప్రధాన స్టేషన్ల తరహాలోనే సదుపాయాలు కల్పించారన్నారు. ప్లాట్ఫాంల నిర్మాణం, వెయిటింగ్ హాల్, టికెట్ కౌంటర్, స్టేషన్ మాస్టర్ గదిని నిర్మించారన్నారు. *త్వరలోనే ఆర్.ఓ.బిల నిర్మాణం*.కొండపల్లి వద్ద లెవల్ క్రాసింగ్ (ఎల్.సి) 140 వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB), ఇబ్రహీంపట్నం మండలంలోని ఈలప్రోలు వద్ద ఎల్.సి 147 వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB), నిర్మాణ పనులను అతిత్వరలోనే ఎంపి కేశినేని శివనాథ్ సహకారంతో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.*కొండపల్లి ఎస్టీ కాలనీలో డ్రైనేజీ పరిశీలన*కొండపల్లి ఎస్టి కాలనీ వద్ద రైల్వే లైన్ కింద డ్రైనేజీని కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. పూడికను తొలగించక పోవడం వల్ల, అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల డ్రైనేజీ నీటితోపాటు వరదనీరు ఉప్పొంగి సమీప గృహాలు వరద ముంపునకు గురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎంపి కేశినేని శివనాథ్ కి వివరించారు. రేపు జరగబోయే డి.ఆర్.ఎమ్ మీటింగ్ లో ఈ సమస్య ను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.*గొల్లపూడి ఆర్.ఓ.బి వద్ద డ్రైనేజీ పనుల పరిశీలన*ఈ పర్యటనలో ముందుగా ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గొల్లపూడి ఆర్వోబి వద్ద డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాలవల్ల డ్రైనేజీ నీరు పారుదల సౌకర్యం సక్రమంగా లేదని గుర్తించారు. ఈ సమస్యను కూడా రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , మైలవరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) లతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Home Andhra Pradesh కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తాము : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)...