ఎన్టీఆర్ జిల్లా, జూన్ 03, 2025 అత్యంత పారదర్శకంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ దివ్యాంగులు, వృద్ధులు చౌక ధరల దుకాణాలకు రావొద్దు ఇళ్లవద్దకే వారికి రేషన్ అందజేయడం జరుగుతుంది జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ*అత్యంత పారదర్శకంగా కార్డుదారులకు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం జరుగుతోందని.. దివ్యాంగులు, 65 ఏళ్లుపైబడిన వృద్ధులు చౌక ధరల దుకాణాలకు రావొద్దని.. వారి ఇళ్లకే డీలర్లు వచ్చి సరుకులు అందజేస్తారని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు.మంగళవారం విజయవాడలోని సీతారాంపురం ఎల్వీ శాస్త్రి వీధిలోని 65 ఏళ్లు పైబడిన కార్డుదారుని ఇంటికే డీలరు వెళ్లి సరుకులు అందించే ప్రక్రియలో జేసీ ఇలక్కియ పాల్గొన్నారు. అనంతరం 225 నంబరు రేషన్ దుకాణాన్ని తనిఖీచేసి, సరుకుల పంపిణీ స్థితిగతులను పరిశీలించారు. సమాచారంతో కూడిన డిస్ప్లే బోర్డులను, క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ ఇలక్కియ మాట్లాడుతూ ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీలోగా కార్డుదారులకు సరుకులు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని.. అదేవిధంగా దివ్యాంగులు, 65 ఏళ్లుపైబడిన వృద్ధులకు అయిదో తేదీలోగానే ఇళ్లవద్దే రేషన్ అందించడం జరుగుతుందని, ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పేర్కొన్నారు.జేసీ వెంట సర్కిల్ – 2 ఏఎస్వో వి.శ్రీనివాసులు, సెంట్రల్ తహసీల్దార్ ఎం.వెంకటరామయ్య, ఆర్ఐలు భగీరథ, మణికంఠ, కృష్ణ, వీఆర్వోలు ఉన్నారు.
Home Andhra Pradesh అత్యంత పారదర్శకంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ దివ్యాంగులు, వృద్ధులు చౌక ధరల దుకాణాలకు...