కళాకారుల ఐక్యవేధక సభను విజయవంతం చేయండి గర్రె శివ రమేష్ విజయవాడ. జూన్ 3 విజయవాడ: కళాకారుల ఐక్యవేధక సభను విజయవంతం చేయాలని ఇంద్రధనుస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గర్రె శివ రమేష్ అన్నారు. కలబ్రతకాలి కళాకారుడు బ్రతకాలి అంటే కళాకారులంతా ఒక్కటి అవ్వాలని కళాకారుల ఐక్యంగా ఉండేందుకు ఒక వేదిక కావాలని జూలైలో కళాకారుల ఐక్యవేదిక సమావేశానికి అందరూ కలిసి రావాలని మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో శివ రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం కళాకారులందరికి వారి వారి వృత్తిలో ఉన్న సమస్యలపై అందరూ ఒక చోట సమీకరించుకొని కళాకారులందరూ ఏ సమస్య లేకుండా ఉండాలంటే సమాజంలో ఎవరెవరు నుంచి ఎలాంటి సహాయం , ప్రోత్సాహం లభిస్తుందొ చర్చించుకుని ఒక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఘంటశాల కల్చరల్ వ్యవస్థాపకులు సినీ డైరెక్టర్ ఎస్.కె హుస్సేన్ మాట్లాడుతూ జులై నెలలో విజయవాడ వన్ టౌన్ లో ఇంద్రధనుస్సు సకల కళాకారుల ఐక్యవేదిక పై రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల అందరూ ఒక చోట కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది.ఆ కార్యక్రమ పూర్తి వివరాలను త్వరలో మీకు తెలుపుతామని ఆయన అన్నారు. సమావేశం అనంతరం కళకు కలం తోడు అనే నినాదానికి మద్దతుగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఇంద్రధనుస్సు ఐక్యవేదిక పోస్టర్ ని ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో ఆర్. కే అమరావతి ఎంటర్టైనర్స్ అధినేత రోహిణి కాంత్ (చిన్ని), విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు సినీ నటులు వేంపల్లి గౌరీ శంకర్ ,కళాతపస్సు డాన్స్ అకాడమీ చైర్మన్ సి.హెచ్ రమేష్, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.ఎస్ నాయుడు, మూవీ డైరెక్టర్ శివ , నక్షత్ర కళావేదిక అధ్యక్షులు వరపర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.