రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని, వ్యవస్థలు అదుపు తప్పిపోతే.. పోలీసు వ్యవస్థ ఎలా దిగ జారి పోతుందో చెప్పడానికి తెనాలి ఘటన నిదర్శనం అని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు.రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా బుధవారం వెన్నుపోటు దినోత్సవంగా నిరసనలకు పిలుపునిచ్చారు.తెనాలిలో పోలీసుల దాడిలో గాయపడిన యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు.**గుంటూరు జిల్లా తెనాలిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘనలు పరిశీలిస్తే, చంద్రబాబు, టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు.చంద్రబాబు దగ్గర ఉండి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో పెట్టి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పరిపాటిగా మారిందని జగన్ ఆరోపించారు.ఏపీలో రెడ్బుక్ రాజ్యంగానికి ఉపయోగపడుతూ పోలీస్ వ్యవస్థ అదుపు తప్పి పోయిందని, దానికి తెనాలి ఘటన నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని, తెనాలి ఘటన ఎందుకు అన్యాయమైన ఘటనో అంతా తెలుసుకోవాలన్నారు.పోలీసులు చేతిలో దెబ్బలు తిన్నవాడు దోమ రాకేష్, చేబ్రోలు జాన్ విక్టర్, కరీముల్లా ఉన్నారని, దళితులు, మైనార్టీ వర్గాలపై పోలీసులు అన్యాయం దాడి చేశారని జగన్ ఆరోపించారు.దోమా రాకేష్ జోమోటోలో హైదరాబాద్లో పని చేసుకుంటున్నాడని, పాత కేసు విచారణ వాయిదా కోసం తెనాలి వచ్చాడని, అతను హైదరాబాద్లో ఉంటున్నాడని, తెనాలి రావడంతో అతడిని చూడటానికి అతని స్నేహితులు మంగళగిరి నుంచి వచ్చారని జగన్ వివరించారు.విక్టర్ జూనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్నాడని, అతనితో పాటు మంగళగిరి నుంచి మెకానిక్ కరీముల్లా కలిసి తెనాలి వచ్చారని, 24 వ తేదీ ఐతానగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉండగా సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ అక్కడ మరో యువకుడితో గొడవ పడుతుండగా వారిని విడదీశారని జగన్ చెప్పారు.కానిస్టేబుల్ జాన్ విక్టర్ బైక్ తాళాలు, ఫోన్ లాక్కోవడంతో వారి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. ఏప్రిల్ 24వ తేదీన గొడవ జరగ్గా ఏప్రిల్ 25న మంగళగిరి వెళ్లిన పోలీసులు విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తెనాలి తీసుకొచ్చారని, తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్లో కొట్టారని, ఏప్రిల్ 26వ తేదీన రోడ్డు మీద బహిరంగంగా కొట్టారని, ఇదే ఘటన టూటౌన్ సీఐతో పాటు పక్కన ఉన్న మరో సీఐ కలిసి వారిని కొట్టారని చెప్పారు.యువకులను నడిరోడ్డుపై మీద వారి పరువు తీసేలా కాళ్లకు బొబ్బలు వచ్చేలా కొట్టారని, ఆ తర్వాత మళ్లీ స్టేషన్కు తీసుకు వెళ్లి 27వ తేదీ ఐతానగర్ లింగారం జంక్షన్కు తీసుకెళ్లి రోడ్డు మీద రెండోసారి కొట్టారని జగన్ వివరించారు. 25 నుంచి మూడు రోజుల పాటు పోలీసుల అదుపులోనే ఉంచుకుని 27వరకు చిత్ర హింసలకు గురి చేశారని, విక్టర్ జేబులో కత్తి పెట్టి, ఇద్దరు వీర్వోలను మారణాయుధాలు ఉన్నట్టు పంచనామా రాశారని చెప్పారు.25, 26 పోలీసుల అదుపులో ఉన్న యువకుల జేబుల్లోకి 27వ తేదీన కత్తి ఉన్నట్టు ఎలా పంచనామా రాయించారని జగన్ ప్రశ్నించారు. కోర్టులో హాజరు పరచడానికి ముందు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు లేవని సర్టిఫికెట్ తీసుకుని 28నకోర్టులో హాజరు పరిచారని, పోలీసులు కొట్టారని, గాయాలు ఉన్నాయని చెబితే ఎస్పీ ఆఫీసుకు తీసుకువెళ్లి కరెంట్ షాక్ ఇస్తామని బెదిరించారని ఆరోపించారు.యువకులతో గొడవ పడినట్టు పోలీసులు చెప్పే మాటలు వాస్తవమైతే 24న గొడవ జరిగితే 25వ తేదీ వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని జగన్ ప్రశ్నించారు.అంబేడ్కర్ విగ్రహానికి కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్ ఉందని, సివిల్ డ్రెస్లో అంబేడ్కర్ విగ్రహం దగ్గరకు ఎందుకు వచ్చాడని, ఎందుకు యువకులతో గొడవ పడ్డాడని జగన్ ప్రశ్నించారు. ఏప్రిల్ 25న ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు 24 గంటల్లో ఎందుకు కోర్టులో హాజరు పరచలేదని ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం లేని సీఐ వారిని ఎందుకు కొట్టాడని ప్రశ్నించారు. యువకులను అతను ఎందుకు కొట్టాల్సి వచ్చిందన్నారు.**కోర్టులో ప్రవేశపెట్టే ముందు హాస్పటల్కు ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చిందని, తమను పోలీసులు కొట్టారని, గాయాలు ఉన్నాయని డాక్టర్లకు చెబితే వాటిని డాక్టర్లు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు డాక్టర్లను బెదిరించారా, ప్రలోభాలకు లోనయ్యారో చెప్పాలన్నారు.ఈ మొత్తం వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరగాలన్నారు.ఏప్రిల్ 24న నడిరోడ్డుపై కొడితే నెల రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చిందని, వీడియో రికార్డ్ చేసింది పోలీసులేనని, పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను భరించలేక వీడియోలను బయట పెట్టారని జగన్ చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులేనని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా బురద వేసే ప్రయత్నం చేస్తున్నారని, పాత కేసులకు ఈ ఘటనకు సంబంధం ఏమిటని, పాత కేసులకు తెనాలి ఘటనకు సంబంధం ఏముందని ప్రశ్నించారు ఇళ్లకు వెళ్లి, వారిని దారుణం రోడ్లపై హింసించి పరువు తీసే అధికారం ఎవరిచ్చారని, తప్పును ఒప్పుగా నిరూపించే ప్రయత్నం చేశారని, విక్టర్ జూనియర్ అడ్వకేట్ అని, రాకేష్ పాలిటెక్నిక్ చదువుకున్నాడని వారి పరువు తీసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మంగళగిరికి చెందిన వారిని తెనాలి తీసుకు వచ్చి కొట్టడమే, పోలీసులు అబద్దాలు చెబుతున్నారని అర్థమవుతోందన్నారు. కరీముల్లా మెకానిక్గా పనిచేస్తున్నాడని ముగ్గురి మీద రౌడీ షీట్ నమోదు చేశారని, ఈ వివాదం పెద్దగా అవుతుందని తెలిసి ఘటన జరిగిన తర్వాత వారిపై రౌడీ షీట్ తెరిచారని ఆరోపించారు. పోలీసులు ఎలా దుర్మార్గం చేశారని, చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ద్వారా గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.**పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, సీఐలు, డిఎస్పీలను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటుందని, ఎమ్మెల్యేలు దగ్గరుండి పోలీసులతో మామూళ్లు వసూలు చేస్తున్నారని, పోలీసులు దగ్గరుండి, ప్రతి నియోజక వర్గంలో మామూళ్లు వసూలు చేస్తున్నారని, పర్మిట్ రూమ్, బెల్ట్ షాప్లకు డబ్బులు వసూలు చేసి చంద్రబాబు, లోకేష్కు వాటాలు చెల్లిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇసుక, క్వార్ట్జ్, లాటరైట్ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు.గొడవ పడ్డ పిల్లల్ని తాను వెనకేసుకు రావడం లేదని, వయసులో ఉండగా గొడవలు జరిగి ఉండొచ్చని, ఎవరిది న్యాయం, ఎవరిది ధర్మం అని తాను చెప్పలేనని, జడ్జిలు అన్ని వైపులా వాదనలు విని, న్యాయం అన్యాయాలు నిర్ణయిస్తారని, కేసులు ఉన్న ప్రతి వారు ముద్దాయిలు కాలేరని, వారి కుటుంబాల పరువు తీసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాకేష్ చెల్లెలు ఇంజనీరింగ్ పూర్తి చేశారని, వారి కుటుంబ పరువు తీశారని, విక్టర్ తండ్రి ప్రజాశక్తిలో విలేకరిగా పని చేస్తున్నాడని, తెనాలిలో నివాసం ఉండని రాకేష్ను కేసులో ఇరికించారని జగన్ ఆరోపించారు
Home Andhra Pradesh రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందని, వ్యవస్థలు అదుపు తప్పిపోతే.. పోలీసు వ్యవస్థ...