బాహుబలి హీరోయిన్ అనుష్క శెట్టి మళ్లీ ఫామ్లోకి వచ్చింది. బాహుబలి తర్వాత చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో అలరించింది. అయితే అనుష్క శెట్టి కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా వుంది. ఆ మధ్యలో బరువు కారణంగా అనుష్క పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందని.. దాని కారణంగానే సినిమాలకు దూరంగా ఉందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి.
ఇక తాజాగా మీడియాకు దర్శనమిచ్చింది. తాజాగా అనుష్క శెట్టి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళంలో తను నటించిన కొత్త చిత్రం యూనిట్తో ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చింది.
![]()

