గత వారం రోజులుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న పుత్తడి ధరలు నేడు ఓ మోస్తరుగా పెరిగాయి. హైదరాబాద్లో 22 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 260 పెరిగి రూ. 60,619కి చేరుకుంది. 10 గ్రాముల స్వచ్ఛమైన (24 కేరెట్లు) బంగారం ధర రూ. 280 పెరిగి రూ. 66,619కి చేరుకుంది. వెండి ధర రికార్డు స్థాయిలో కిలో రూ. 80,100 చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ గత వారం రోజులుగా పుత్తడి ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60 వేల వద్ద ఊగిసలాడింది. 22 కేరెట్ల ధర రూ. 55 వేలకు అటూఇటుగా రూ. 55 వేల వద్ద కదలాడింది. ఇప్పుడు మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఈ ఉదయం 8 గంటలకు నమోదైనవి మాత్రమే. అంటే.. నిన్నటి క్లోజింగ్ ధరలు. వీటిలో ఏ క్షణాన అయినా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కాబట్టి కొనుగోలుదారులు అప్పటి రేట్లను తెలుసుకోవాల్సి ఉంటుంది.
Spread the love ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తాము నిధులు తీసుకోలేదని మూడు లెఫ్ట్ పార్టీలు సీసీఐ(ఎమ్), సీపీఐ, సీపీఐ(ఎమ్ఎల్) గతేడాదే ఈసీకి తెలియజేశాయి. ఈసీ తాజాగా బయటపెట్టిన వివరాల్లో ఈ విషయం వెల్లడైంది. ఎలక్టోరల్ […]
Spread the love అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 మేర తగ్గించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. […]
Spread the love ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పేర్కొన్నారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమే అయినా విచారణకు తాను […]