ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనపై ముందస్తు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిల్ బేలా ఎం. త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది.
లిక్కర్ కేసులో గత ఏడాది మార్చిలో ఈడీ ముందు విచారణకు కవిత పలుమార్లు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలోనే సాక్షిగా సీబీఐ విచారించింది. అయితే సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా మారుస్తూ విచారణకు హాజరు కావాల్సిందిగా సీఆర్పీసీ 41ఏ కింద సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ, సీబీఐల ముందు విచారణకు హాజరు కావాలా? లేదా? అనే విషయం ఈరోజు తేలపోనుంది. ఈరోజు జరిగే సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారనుంది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఈడీ వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.
Spread the love అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తరచూ దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ నెల 6న కూడా జాన్వీ తన బర్త్డే సందర్భంగా […]
Spread the loveవిషయం: దేవాలయ అభివృద్ధి ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం. విరాళం సంస్థ పేరు ఇవ్వడమైనది : ప్రకాశ్ ఆర్ట్స్, గవర్నర్పేట, విజయవాడ.విజయవాడ: విజయవాడలోని ప్రకాశ్ ఆర్ట్స్, గవర్నర్పేట అధినేత సి.డి.వి. […]
Spread the loveఎన్టిఆర్ జిల్లా 16:22.11.2025 కవులు రచయితలు కళాకారుల సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు… సాంస్కృతిక కళా సంపదలు భావితరానికి వన్నెతగ్గని వనరులు.. కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కండి.. జిల్లా […]