గత ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇంతకుముందు ఇచ్చిన హామీలపై బదులిచ్చాకే బస్సు ఎక్కాలంటూ జగన్ కు సవాల్ విసిరారు. 99 శాతం హామీలను అమలు చేశామని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, వాస్తవంలో మాత్రం 99 హామీలపై ప్రజలను జగన్ ఏమార్చారని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ‘హామీల అమలు ఓ బూటకం.. విశ్వసనీయతపై జగన్ కబుర్లు అతిపెద్ద నాటకం’ అంటూ గురువారం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఐదేళ్ల పదవీకాలాన్ని విధ్వంసాలకు, దోపిడీకి, కక్షా రాజకీయాలకు వెచ్చించారని జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
![]()

